Elephant Turns Violent : ఆలయ వేడుకల్లో బీబత్సం సృష్టించిన ఏనుగులు..
ఓ ఏనుగు అకస్మాత్తుగామా వటిని కింద పడేసి, మరో ఏనుగుపై దాడికి ప్రయత్నించింది. దీంతో ఆ ఏనుగు పరుగందుకుంది
- By Sudheer Published Date - 12:02 PM, Sat - 23 March 24
త్రిస్సూర్ (Thrissur) లోని ఓ ఆలయ వేడుకల్లో (Tharakkal temple festival) రెండు ఏనుగులు (Elephants) బీబత్సం సృష్టించాయి. త్రిస్సూర్ జిల్లా అరట్టుపుజ గ్రామంలోని థారక్కల్ ఆలయంలో శుక్రవారం రాత్రి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంకేలో భక్తులు వచ్చారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు అకస్మాత్తుగామా వటిని కింద పడేసి, మరో ఏనుగుపై దాడికి ప్రయత్నించింది. దీంతో ఆ ఏనుగు పరుగందుకుంది. దాదాపు కిలోమీటర్ దూరం పరిగెత్తింది.
We’re now on WhatsApp. Click to Join.
నియంత్రించేందుకు ప్రయత్నించిన మావటి శ్రీకుమార్ పైనా దాడి చేసింది. పైనుంచి కిందపడేయడంతో గాయపడ్డ శ్రీకుమార్ ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో చాలామంది కిందపడి గాయాలపాలయ్యారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఎలిఫెంట్ స్క్వాడ్ అతికష్టమ్మీద రెండు ఏనుగులను కంట్రోల్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A captive #elephant runs amok during the Arattupuzha pooram in #Kerala's Thrissur. The elephant attacked an elephant and also injured several humans.
It is peak summer and also peak of temple festivals in Kerala. pic.twitter.com/QHvDLTPgOP— Bobins Abraham Vayalil (@BobinsAbraham) March 23, 2024
Read Also : Digvijaya Singh: 33 ఏళ్ల తర్వాత లోక్సభ ఎన్నికల బరిలో మాజీ సీఎం
Related News
Accident News: కేరళలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. 25 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
కేరళలోని త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ సమీపంలో మంగళవారం ఉదయం రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ప్రమాదం (Accident) లో 25 మందికి పైగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.