Drought : ఐరోపాను కమ్మేసిన కరువు మేఘాలు..ఎండిపోతున్న నదులు, పెరుగుతున్న ఉష్ణోగ్రత!!
కరువు అనగానే ఆఫ్రికా దేశాలే ఒకప్పుడు గుర్తుకు వచ్చేవి.కానీ ఇప్పుడు ఐరోపా దేశాలన్నీ కూడా కరువుతో అల్లాడుతున్నాయి. బ్రిటన్.. ఫ్రాన్స్.. ఇటలీ.. హంగేరి.. సెర్బియా.. స్పెయిన్.. పోర్చుగల్.. జర్మనీ దేశాల్లో కరువు విలయ తాండవం చేస్తోంది.
- By Hashtag U Published Date - 08:00 PM, Sun - 14 August 22
కరువు అనగానే ఆఫ్రికా దేశాలే ఒకప్పుడు గుర్తుకు వచ్చేవి.కానీ ఇప్పుడు ఐరోపా దేశాలన్నీ కూడా కరువుతో అల్లాడుతున్నాయి. బ్రిటన్.. ఫ్రాన్స్.. ఇటలీ.. హంగేరి.. సెర్బియా.. స్పెయిన్.. పోర్చుగల్.. జర్మనీ దేశాల్లో కరువు విలయ తాండవం చేస్తోంది.
బ్రిటన్లో..
బ్రిటన్లో థేమ్స్ నది ఎండిపోతోంది.ఇందులో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. నది జన్మస్థానం వద్ద వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా నది ఎండిపోయింది! దక్షిణ, మధ్య, తూర్పు ఇంగ్లండ్లో ఏకంగా 8 ప్రాంతాలను కరువు ప్రభావితమైనవిగా బ్రిటన్ ప్రకటించింది.1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి! ఇంగ్లండ్లో కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ పైగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది జూలై అత్యంత పొడి మాసంగా రికార్డులకెక్కింది.బ్రిటన్లో జూలైలో సగటు వర్షపాతం 35% మాత్రమే నమోదైంది. దాంతో ఆవులు తాగే నీళ్లపై కూడా రోజుకు 100 లీటర్లు అంటూ రేషన్ విధిస్తున్నారు. మొక్కజొన్న ఉత్పత్తి 30%, పొద్దుతిరుగుడు ఉత్పత్తి 16 లక్షల టన్నులకు తగ్గనుందని అంచనా. బంగాళదుంప రైతులంతా నష్టపోయారు.
ఫ్రాన్స్లో..
ఫ్రాన్స్లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. గిర్నోడ్ లో 74 చదరపు కిలోమీటర్ల మేర కార్చిచ్చు వ్యాపించింది. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. ఫ్రాన్స్లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2,100 గాలన్లు నీరు ప్రవహించే చోట్ల కూడా ఇప్పుడు చుక్క నీరు కనిపించడం లేదు. ఫ్రాన్స్లో 100కు పైగా మున్సిపాల్టీల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేస్తున్నారు.
స్పెయిన్, జర్మనీలలో..
* స్పెయిన్లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా, మెక్సికోల్లో కనబడుతున్నాయి. 500 ఏళ్లకోసారి మాత్రమే ఇంతటి కరువు పరిస్థితులను చూస్తామని నిపుణులు చెబుతున్నారు.
నదులు ఎండిపోతూ ఉండడంతో జల విద్యుత్కేంద్రాలు మూతపడుతున్నాయి.
* జర్మనీలోని రైన్ నదిలో నీటి ప్రవాహం తగ్గిపోతూ వస్తోంది. చాలాచోట్ల 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. ఈ నదిపై రవాణా ఆగిపోతే 8 వేల కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుంది.
ఇటలీలో..
* ఇటలీలో గత 70 ఏళ్లలో చూడనంతటి అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటలీలోని అతి పెద్ద నది పో సగం వరకు ఎండిపోయింది. స్పెయిన్లో ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. హంగరీలో నదులన్నీ బురద గుంతలుగా మారిపోతున్నాయి నీటి కరవుతో ఇటలీలోని అతి పొడవైన ‘పో’ నది చుట్టు ఉన్న ప్రాంతాలు బీడు భూములుగా మారుతున్నాయి.ఈ నీటి కొరత వలన ఇటలీ వ్యవసాయ ఉత్పత్తుల్లో 30 శాతం దిగుబడి తగ్గనుంది.
Related News
Kurnool: కర్నూలు రైతులపై కరువు ప్రభావం, మామిడి సాగుపై ఆశలు!
Kurnool: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతంలో ఖరీఫ్, రబీ పంటలకు వరి సాగు అనుకూలించలేదు. దీంతో రైతులు పెద్ద ఎత్తున మామిడి సాగు వైపు మొగ్గు చూపారు. ఉమ్మడి జిల్లాలో, 80 శాతం తోటలు ప్రసిద్ధి చెందిన బంగినపల్లి (బెనిషన్) రకానికి గుర్తింపు ఉంది. మిగిలిన 20 శాతంలో ఇమామ్ పసంద్, దిల్పసంద్, నీలం మరియు తోతాపురి వంటి ఇతర ప్రసిద్ధ రకాలు ఉన్నాయి. తమ వ్యవసాయ అప్పులు, ఆర్థిక ఇబ్బందులను అ�