Potato: బంగాళదుంపతో ఇలా చేస్తే చాలు.. ముడతలు పారిపోవాల్సిందే?
మామూలుగా వయసు మీద పడుతున్న కొద్ది అలాగే ఇతర కారణాల వల్ల ముఖంపై ముడతలు రావడం అనేది సహజం. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది
- By Anshu Published Date - 10:20 PM, Mon - 4 September 23

మామూలుగా వయసు మీద పడుతున్న కొద్ది అలాగే ఇతర కారణాల వల్ల ముఖంపై ముడతలు రావడం అనేది సహజం. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది వివిధ కారణాలవల్ల చిన్న వయసులోనే ముఖంపై ముడతల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ముడతల సమస్యతో బాధపడే వారు కొన్ని రకాల వంటింటి చిట్కాలను ఉపయోగించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.. మరి అందుకోసం ఎటువంటి చిట్కాలు ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బియ్యప్పిండి బంగాళదుంప ప్యాక్…ఈ ప్యాక్ తయారు చేసేందుకు మీకు కావాల్సింది బియ్యం పిండి, పాలు, బంగాళా దుంపలు.
బంగాళాదుంపలు ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ని కలిగి ఉంటాయి. ఇందులోని బ్లీచింగ్ గుణాలు ముఖాన్ని కాంతివంతంగా తయారు చేసి చర్మంపై ముడతల్ని దూరం చేస్తుంది. హెల్దీ, మెరిసే చర్మాన్ని పొందేందుకు మీకు ఈ బంగాళాదుంప ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల నల్ల మచ్చలు దూరమవుతాయి. పాలలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉంటాయి. వీటి వల్ల అందంగా తయారవుతారు. దీంతో చర్మం మెరుస్తూ, అందంగా మారేలా చేస్తుంది. ప్రతి రోజూ ముఖంపై పచ్చిపాలని అప్లై చేస్తే కాంతి వంతమైన, మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. చర్మ కణాలని మెరుగ్గా చేస్తుంది. చల్లని పాలలో దూదిని నానబెట్టి కళ్ళపై పెట్టుకుంటే కళ్ళు కాంతివంతంగా మారతాయి.
బియ్యంపిండిలో కూడా ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయి. దీనిలో స్క్రబ్ గుణాలు నేచురల్ స్క్రబ్బర్లా పనిచేస్తుంది. దీని వల్ల యూవి కిరణాల నుండి మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. బియ్యం పిండిని వాడితే బ్లాక్ హెడ్స్ తగ్గి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ముందుగా బంగాళాదుంప తురిమి అందులో పిండి వేసి, పాలు వేసి ప్యాక్ల చేయాలి. ముఖాన్ని క్లీన్ చేశాక ఈ ప్యాక్ అప్లై చేయాలి. 10 నిమిషాలు అలానే ఉండి ఆరిపోయాక క్లీన్ చేయాలి. ఇలా వారానికి ఒకటి, రెండు సార్లు చేస్తే చాలా లాభాలు ఉంటాయి. ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా చర్మంపై ఉన్న మచ్చలు చాలా వరకూదూరం చేస్తాయి. ఇలా ముడుతలు పడ్డాయని చాలామంది రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అలా ఉపయోగించేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.