Mysore Bonda : మైదాపిండి లేకుండా మైసూర్ బోండాలను తయారు చేయండిలా..
హోటల్స్, రోడ్ల పక్కన ఉండే బండ్లమీద లభించే మైసూర్ బోండాలకే రుచెక్కువ. వాటిని తింటే.. ఆరోగ్యం కూడా పాడవుతుంది. బరువు పెరుగుతాం.
- By News Desk Published Date - 10:02 PM, Sat - 4 November 23
Mysore Bonda : మైసూర్ బోండాలు. ఉదయం పూట టిఫిన్ గా లేదా.. సాయంత్రం పూట స్నాక్ ఐటమ్ గా తినే ఫుడ్. వీటిని వండేందుకు ఎక్కువగా మైదాపిండిని వాడుతారన్న విషయం తెలిసిందే. ఇళ్లలో కంటే.. బయట హోటల్స్, రోడ్ల పక్కన ఉండే బండ్లమీద లభించే మైసూర్ బోండాలకే రుచెక్కువ. వాటిని తింటే.. ఆరోగ్యం కూడా పాడవుతుంది. బరువు పెరుగుతాం. ముఖ్యంగా ఇందులో వాడే మైదాపిండి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కానీ తినకుండా ఉండలేం. వాటికుండే టేస్ట్ అలాంటిది మరి. వేడి వేడి మైసూర్ బోండాల్లో.. పల్లీల చట్నీ, టొమాటో చట్నీ కాంబినేషన్ తో తింటే ఆ రుచేవేరు.
మరి అంతరుచిగల్లా మైసూర్ బోండాలను తెలిసి తెలిసి రోజూ తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకోలేం కదా. అందుకే.. మైదాపిండి లేకుండా.. ఆరోగ్యానికి హాని కలుగకుండా.. గోధుమపిండితో మైసూర్ బోండాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
గోధుమపిండి బోండాల తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి – 1 కప్పు
బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 టీ స్పూన్
వంటసోడా – 1/4 టీ స్పూన్
పుల్లటి పెరుగు – 1 కప్పు
నూనె – డీప్ ఫ్రై కు సరిపడా.
మైసూర్ బోండా తయారీ విధానం..
ఒక గిన్నెలోకి గోధుమపిండిని తీసుకుని.. అందులో బియ్యంపిండి, ఉప్పు, జీలకర్ర, వంటసోడా వేసి కలుపుకోవాలి. తర్వాత పెరుగు వేసి.. తగినన్ని నీళ్లు పోసి బోండం వేసేందుకు వీలుండేలా పిండిని కలుపుకోవాలి. తర్వాత దానిపై మూతపెట్టి 15 నిమిషాలపాటు పక్కకు ఉంచుకోవాలి. పిండిని మరోసారి కలుపుకున్నాక కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
ఇప్పుడు పిండిని చేతిలోకి తీసుకుని గుండ్రంగా చేసుకుని నూనెలో వేసుకోవాలి. మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యేంతవరకూ వేయించుకుని.. ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే.. హెల్దీ మైసూర్ బోండాలు రెడీ. వీటిని ఎంచక్కా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని తినడమే.
Related News
Carrot Milk Shake : క్యారెట్ మిల్క్ షేక్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..
ఇంట్లోనే హెల్దీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు. తీపి కోసం పంచదార శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. పంచదార వేయకుండానే ఈ మిల్క్ షేక్ ను తయారు చేసుకోండి..