HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Ujjwala Scheme Implementation Spiked In Election Years Rti

Ujjwala scheme : ప్ర‌ధాన మంత్రి ఉజ్వ‌ల “కేసీఆర్” గ్యాస్ క‌బుర్లు!

ప్ర‌ధాన మంత్రి ఉజ్వ‌ల యోజ‌న కింద ఉచితంగా అందిస్తోన్న గ్యాస్ క‌నెక్ష‌న్ల భాగోతం చూస్తే..పేద‌ల‌పై ప్ర‌భుత్వాల‌కు ఉండే ఉదాసీనత‌ బ‌య‌ట‌ప‌డుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం రాకెట్ మాదిరిగా ఉచిత క‌నెక్ష‌న్ల సంఖ్య‌ను పెంచ‌డం, ఆ త‌రువాత మొఖం చాటేయ‌డం ప‌రిపాటి అయింది

  • By CS Rao Published Date - 02:54 PM, Wed - 1 December 21
  • daily-hunt

ప్ర‌ధాన మంత్రి ఉజ్వ‌ల యోజ‌న కింద ఉచితంగా అందిస్తోన్న గ్యాస్ క‌నెక్ష‌న్ల భాగోతం చూస్తే..పేద‌ల‌పై ప్ర‌భుత్వాల‌కు ఉండే ఉదాసీనత‌ బ‌య‌ట‌ప‌డుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం రాకెట్ మాదిరిగా ఉచిత క‌నెక్ష‌న్ల సంఖ్య‌ను పెంచ‌డం, ఆ త‌రువాత మొఖం చాటేయ‌డం ప‌రిపాటి అయింది. తెలంగాణలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 40 కనెక్షన్లు మాత్రం ఇచ్చారు. ఆ త‌రువాత ఏడాది( 2017-18) లో ఒక్క క‌నెక్ష‌న్ కూడా ఇవ్వ‌లేదు. ఆ ఏడాది క‌నెక్ష‌న్ల సంఖ్య సున్నాకు పడిపోయింది. అదే 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో 9,16,299 క‌నెక్ష‌న్లను ప్ర‌భుత్వం మంజూరు చేసింది. కార‌ణం, ఆ ఏడాది రెండవ శాసనసభ ఎన్నికల ఉండ‌డంతో పేద గ్రామీణ మ‌హిళ‌ల మీద ప్ర‌భుత్వానికి శ్ర‌ద్ధ పుట్టుకొచ్చింది.తెలంగాణ‌ రాష్ట్రంలో మాదిరిగానే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎన్నిక‌లు వ‌చ్చిన స‌మ‌యంలో మాత్ర‌మే ప్ర‌ధాన మంత్రి ఉజ్వ‌ల యోజ‌న ప‌థ‌కం కింద గ్యాస్ కనెక్ష‌న్లు ఇస్తున్నారు. ఆ త‌రువాత ఆ స్కీంను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు నామ‌మాత్రం చేస్తున్నాయ‌ని డేటా చెబుతోంది.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్రామీణ గృహాలకు LPG కనెక్షన్‌లను అందుబాటులోకి తీసుకురావాలనే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు శ్రీకారం చుట్టారు. ఆ పథకం కింద లబ్ధిదారుల వివరాలను ఆర్డీఐ ద్వారా సేక‌రించ‌గా, పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ వివ‌రాల‌ను అందించింది. వాటి ప్ర‌కారం 2016-17లో దేశ వ్యాప్తంగా 1,93,05,327 ఉచిత కనెక్షన్లు పంపిణీ చేయగా, 2017-18లో 1,58,69,857కి పడిపోయింది. కానీ 2018-19లో 100 శాతం పెరుగుదలతో 3, 57,64,417 కొత్త కనెక్షన్‌లను ఇచ్చారు. మరుసటి ఏడాది ఆ సంఖ్య కేవలం 90,60,124కి పడిపోయింది.

2016లో, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద 2020 నాటికి 8 కోట్ల LPG కనెక్షన్‌లను నిరాశ్రయులైన గృహాలకు విడుదల చేయడం లక్ష్యం. ఇది మార్చి 2020 గడువు కంటే ఏడు నెలల ముందుగా, ఆగస్టు 2019లో సేక‌రించ‌డం జ‌రిగింది. 2016-17లో, ఉజ్వల ప్రారంభించబడినప్పుడు, ఢిల్లీలో పంపిణీ చేయబడిన మొత్తం LPG సిలిండర్లు కేవలం 463 మాత్రమే. ఇది 2017-18లో 18కి పడిపోయింది. అయితే, 2018-19లో అది 73,251కి చేరి, మరుసటి ఏడాది మళ్లీ 3,110కి పడిపోయింది. అదేవిధంగా కేరళలో, 2016-17లో మొత్తం కనెక్షన్ 10,872 కాగా, 2017-18లో 27,630కి చేరుకుంది. కానీ మరుసటి ఏడాది ఈ సంఖ్య 1,70988కి పెరిగింది.మార్చి 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్‌లో, 2016-17లో 54,64,190 గ్యాస్ కనెక్షన్‌లతో గరిష్ట పంపిణీ జరిగింది. మరుసటి సంవత్సరం ఆ సంఖ్య కేవలం 10 లక్షలకు ప‌డిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు (2018-19) ఆ రాష్ట్రం 63,17,525 గ్యాస్ కనెక్షన్‌లను పొందింది. పశ్చిమ బెంగాల్‌లో 2016-17 ఆర్థిక సంవత్సరంలో 23,80,518. ఆర్థిక సంవ‌త్స‌రం 2017-18 మరియు 2018-19లో 29,46,062గా క‌నెక్క్ష‌న్ల‌ను మంజూరు చేసిన‌ట్టు ఆర్టీఐ నివేదిక చెబుతోంది.
బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఉచిత గ్యాస్ పంపిణీ కేవలం 6024. కానీ 2017-18లో 8,95,333కి మరియు 2018-19లో 18,54,061కి పెరిగింది. రాష్ట్రంలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, ఆ తర్వాత మే 2019లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అస్సాంలో కూడా 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 మాత్రమే ఉన్న కనెక్షన్ సంఖ్యలు 2017-18లో పది లక్షలకు మరియు 101-19లో పది లక్షలకు పెరిగాయి. ఇలా ఎన్నిక‌ల టైంలో అనూహ్యంగా పేద గ్రామీణ మ‌హిళ‌ల‌కు ఉచిత గ్యాస్ కనెక్ష‌న్ల‌ను ఇస్తూ ఓట్ల‌కు ప్ర‌భుత్వాలు గాలం వేస్తున్నాయ‌ని ఆర్టీఐ ఇచ్చిన ఉజ్వ‌ల్ యోజ‌న నివేదిక స్ప‌ష్టం చేస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gas cylinder
  • pm modi
  • Ujjwala scheme

Related News

PM Modi

PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

PM Modi : ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 13వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు

    Latest News

    • Jubilee Hills Bypoll : బిఆర్ఎస్ లో బయటపడ్డ అంతర్గత విభేదాలు

    • Constable Pramod : ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం – డీజీపీ

    • Constable Pramod Dies: పోలీసులకు రక్షణ లేదు.. రేవంత్కు బాధ్యత లేదు – హరీశ్

    • TDP leader Subba Naidu : టీడీపీ నేత సుబ్బనాయుడు కన్నుమూత

    • AP Govt : ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

    Trending News

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd