Indians Ukraine: ఉక్రెయిన్ నుండి ఇండియాకి బయల్దేరిన మూడవ విమానం..
Third flight Takes Off from Budapest
- Author : Hashtag U
Date : 27-02-2022 - 9:25 IST
Published By : Hashtagu Telugu Desk
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల తరలింపు పక్రియ వేగవంతం అయింది. ఆపరేషన్ గంగా కింద 240 మంది భారతీయ పౌరులతో ఢిల్లీకి మూడవ విమానం హంగేరీలోని బుడాపెస్ట్ నుండి బయలుదేరిందని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. అలాగే, ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 250 మంది భారతీయ పౌరులను తీసుకుని రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుండి రెండవ తరలింపు విమానం ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్ రాజధాని కైవ్లో ఈరోజు ఉదయం రెండు పెద్ద పేలుళ్లు వినిపించాయి. రెండు పెద్ద పేలుళ్లు కైవ్కు నైరుతి దిశలో జరిగాయి. ఒక పేలుడుతో సిటీ సెంటర్ నుండి సుమారు 20 కిలోమీటర్లు లేదా 12 మైళ్ల దూరంలో కనిపించింది.
మరోవైపు గురువారం రష్యా దాడి తర్వాత చెలరేగిన ఉక్రెయిన్ పోరాటంలో 240 మంది పౌరులు మరణించారని, అందులో కనీసం 64 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. రష్యా తన గగనతలాన్ని లిథువేనియా, లాట్వియా, ఎస్టోనియా మరియు స్లోవేనియా నుండి వచ్చే విమానాలకు మూసివేస్తోంది, ఉక్రెయిన్పై దాడి చేయడంతో పశ్చిమ దేశాలతో మాస్కో సంబంధాలు కొత్త అత్యల్ప స్థాయికి పడిపోవడంతో ఈ చర్య వచ్చింది.
https://mobile.twitter.com/DrSJaishankar/status/1497702931130642436