Cabs Surcharge : క్యాబ్ ల `సర్జ్` దోపిడీ
క్యాబ్ డ్రైవర్లు అల్గారిథమ్ ను మార్చేస్తూ సాధారణ చార్జీల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు అధిక ఛార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయడం ఎక్కువ అయింది.
- By CS Rao Published Date - 05:00 PM, Tue - 21 June 22
క్యాబ్ డ్రైవర్లు అల్గారిథమ్ ను మార్చేస్తూ సాధారణ చార్జీల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు అధిక ఛార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయడం ఎక్కువ అయింది. యాప్ లో సాధారణ చార్జీలను డ్రైవర్ లు చూస్తారు. కానీ, అగ్రిగేటర్లు అల్గారిథమ్ ను మర్చేస్తోన్న సందర్భాలను ఇటీవల కేంద్రం గమనించింది.మే 10న, కేంద్ర ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్ ప్లాట్ఫారమ్లతో సమావేశాన్ని నిర్వహించింది. అధిక సర్జ్ ధరలను విధించకుండా హెచ్చరించింది. ముంబైలో, ఏప్రిల్ 1 నుండి, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (MMRTA) సర్జ్ ప్రైసింగ్పై బేస్ ఛార్జీల కంటే 1.5 రెట్లు పరిమితిని విధించింది.
హైదరాబాద్ లో మాత్రం ఇష్టానుసారంగా సర్జ్ ధరలను నిర్ణయిస్తున్నారు. వర్షం కురిసినప్పుడల్లా క్యాబ్ అగ్రిగేటర్లు వసూలు చేసే సర్జ్ ప్రైసింగ్ ప్రయాణికులు భరించలేని విధంగా ఉంది. ఫలితంగా వ్యక్తిగత వాహనాలను వాడాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడుతోంది. దీంతో నగరంలో ట్రాఫిక్, వాయు కాలుష్యం పెరగుతోంది.రుతుపవనాలు నగరాన్ని తాకడంతో సాయంత్రం వేళల్లో రోడ్లు రద్దీగా ఉండటంతో ప్రయాణికులు రెట్టింపు కష్టాలను ఎదుర్కొంటారు. అనేక మంది నెటిజన్లు అధిక ధరల గురించి ఫిర్యాదు చేశారు. వర్షం పడనప్పుడు సర్జ్ ప్రైసింగ్ను కూడా ఎత్తి చూపారు. వ్యక్తిగత వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది.
“క్యాబ్ అగ్రిగేటర్ల డైనమిక్ ధర ముఖ్యంగా వర్షాకాలం ఇబ్బంది పెడుతోంది. `ధరల పెరుగుదల కారణంగా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఖర్చు చేయవలసి వచ్చింది. ఇది సాధారణంగా రూ. 150- రూ. 200 ఎక్కువగా ఉంటుందని ఇన్ఫోసీ ఉద్యోగి జగన్నాథ్ వేణుగోపాల్ అన్నారు.
తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ (టిఎఫ్ఎంసి) ప్రెసిడెంట్ సత్యనారాయణ మఠాల మాట్లాడుతూ క్యాబ్ల ధరలు పెరగడం వల్ల సహజంగానే ఎక్కువ మంది వ్యక్తులు వ్యక్తిగత వాహనాలను రాకపోకలు సాగిస్తారు. నగరంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. “ఈ రేటుతో నగరం మరో బెంగళూరు అవుతుందన్నారు.తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం యూనియన్ వర్కర్స్ (TGPWU) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ, జనాదరణ పొందిన దానికి విరుద్ధంగా, డ్రైవర్లు ధరలను పెంచుతున్నారన్నారు. వాస్తవానికి, కస్టమర్ నుండి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయం కూడా వారికి తెలియదని ఆయన పేర్కొన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో చివరి మైలు కనెక్టివిటీ లేకపోవడం వల్ల చాలా మంది ఐటీ రంగ ఉద్యోగులు క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. దీనిని పరిష్కరించడానికి, ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు మెట్రో స్టేషన్ల నుండి కార్యాలయాలకు రవాణాను ఏర్పాటు చేశాయి.
Tags
Related News
Adani EV : ఉబెర్ – అదానీ గ్రూప్ ఈవీ వ్యాపారం.. ఏం చేస్తారంటే ?
Adani EV : ఇప్పుడు దేశంలో ఏ రంగాన్ని అదానీ గ్రూప్ ముట్టుకుంటే.. ఆ రంగం బంగారంలా డెవలప్ అయిపోతోంది.