HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Sonia Gandhi Welcomes Bharat Ratna For P V Narasimha Rao

Bharat Ratna to PV : పీవీకి భారతరత్న.. చిరంజీవి, సోనియా ఫుల్ హ్యాపీ

  • Author : Sudheer Date : 09-02-2024 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pv Sonia
Pv Sonia

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (P. V. Narasimha Rao) కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) ప్రకటించడం ఫై ప్రతి ఒక్కరు స్పందిస్తూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఈ ప్రకటన ఫై తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా..తాజాగా సోనియా గాంధీ , మెగా స్టార్ చిరంజీవి , రేవంత్ రెడ్డి తదితరులు తమ స్పందనను తెలియజేసారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) : ‘నిజమైన దార్శనికుడు, పండితుడు, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి భారతరత్న రావడం తెలుగువారందరికీ గర్వకారణం. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి ఇండియాను ఆర్థిక శక్తిగా మార్చేందుకు పునాది వేసిన వ్యక్తిని భారతరత్నతో సత్కరించారు. భారతీయులందరికీ ఇది సంతోషకరమైన విషయం’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

సోనియా గాంధీ (Sonia Gandhi) : మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కేంద్రం భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నానని సోనియా తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy): ‘తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ పీఎం చరణ్ సింగ్, LK అద్వానీ, కర్పూరి ఠాకూర్, శాస్త్రవేత్త స్వామినాథన్ గార్లకు భారతరత్న రావడం సంతోషకరం’ అని ట్వీట్ చేశారు.

ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటివరకు ఐదుగురికి భారతరత్న ప్రకటించింది. ఒకే ఏడాదిలో ఐదుగురికి ఈ పురస్కారాన్ని ప్రకటించడం దేశచరిత్రలో ఇదే తొలిసారి. ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేదు. PM మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని సిఫారసు చేయవచ్చు. కానీ 1999లో నలుగురికి ప్రదానం చేశారు. ఈ ఏడాది LK. అద్వానీ, కర్పూరి ఠాకూర్, PV నరసింహారావు, MS స్వామినాథన్, చరణ్ సింగ్ కు ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ( PV Narasimha Rao) భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదిన నేత. సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న ఎకానమీని పట్టాలెక్కించారు. మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించుకుని..హరిత విప్లవం, ఎగుమతులు, టెలి కమ్యూనికేషన్, టెక్నాలజీతో దేశం స్వయంసమృద్ధి సాధించేలా చేశారు. ఇప్పుడు ఉన్న సాంకేతికతకు బీజం వేసింది ఈ మహనీయుడే. విద్యారంగంలోనూ ఎన్నో సంస్కరణలు తెచ్చారు మన తెలుగు ఠీవీ పీవీ. అప్పులతో దేశం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితుల్లో PV నరసింహారావు ప్రధాని పదవి చేపట్టారు. 3 వారాల విదేశీ ద్రవ్య నిల్వలే మిగిలిన క్లిష్ట సమయంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. ఆర్థిక ప్రగతిని ఆలస్యం చేసే, అవినీతిని పెంచే లైసెన్స్ రాజ్యాన్ని రద్దు చేసి భారత్లో ప్రపంచ వర్తకానికి ద్వారాలు తెరిచారు. నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్తో కలిసి తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ ముఖచిత్రం మార్చి, సంక్షోభం నుంచి బయటపడేశాయి.

పీవీ నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో రత్నాబాయి, సీతారామారావు దంపతులకు 1921 జూన్ 28న జన్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన రంగారావు, రుక్మిణమ్మ దంపతులు ఆయనను దత్తత తీసుకున్నారు. 1952లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1957లో తొలిసారి మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానిగా ఉన్నత శిఖరాలు అధిరోహించారు. అలాంటి మాజీ ప్రధానికి భారత రత్న రావడం పట్ల యావత్ ప్రజలు , రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ..ప్రధాని మోడీకి థాంక్స్ చెపుతున్నారు.

Read Also : Bharat Ratna PV : మన పీవీ.. తెలుగుజాతి ఠీవీ.. నర్సింహారావు జీవిత విశేషాలివీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #CMRevanthReddy
  • Bharat Ratna
  • chiranjeevi
  • P. V. Narasimha Rao

Related News

Mana Shankara Varaprasad Pr

‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్లకు చిరంజీవి దూరం ? కారణం అదేనా ?

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల వెన్నెముక భాగంలో చిన్న సర్జరీ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. నొప్పి నుంచి రిలీఫ్ కోసం HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారని టాక్. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

  • Mana Shankara Vara Prasad Garu

    మన శంకర వర ప్రసాద్ గారు ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. వెంకీ మామ ఎంట్రీ అదుర్స్‌!

Latest News

  • బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?

  • అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?

  • మీ వెండి వ‌స్తువుల‌కు ఉన్న‌ నలుపును వదిలించుకోండి ఇలా?!

  • ట్రేడ్ డీల్ కుదరకపోవడానికి మోదీయే కారణం.. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ షాకింగ్ కామెంట్స్..

  • ప్ర‌భాస్ రాజాసాబ్‌.. పార్ట్‌-2 పేరు ఇదేనా?!

Trending News

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd