Vaccine for Cancer: గుడ్ న్యూస్.. మరో నాలుగు నెలల్లోనే అందుబాటులోకి గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్
గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి త్వరలోనే భారీ ఉపశమనం లభించనుంది
- By Nakshatra Published Date - 09:01 PM, Tue - 13 December 22
Vaccine for Cancer: క్యాన్సర్ వ్యాధి బారిన పడి చాలామంది ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారు. క్యాన్సర్ మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అధునాతన చికిత్సలు వచ్చినా.. క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎన్నో మందులు, చికిత్సలు అందుబాటులోకి వచ్చినా క్యాన్సర్ నుంచి బయట పడేయలేక పోతున్నాయి. క్యాన్సర్ లో అనేక రకాలు ఉన్నాయి. అనేక రకాల క్యాన్సర్లు కొత్తగా పుట్టుకోస్తూనే ఉన్నాయి. మానవ శరీరానికి సంబంధించి ఇప్పటిక అనేక క్యాన్సర్లు ఉన్నాయి.
అయితే మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో ఎక్కువగా బాధపడుతున్నారు. మహిళలు ఈ సర్వికల్ క్యాన్సర్ వల్ల ఎక్కువగా మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా ఈ క్యాన్సర్ కనిపిస్తోంది. ఎంతోమంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడి మరణిస్తు్నారు., అయితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చేస్తోంది. కోవిడ్ వర్కింగ్ గ్రూప్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చీఫ్ డాక్టర్ ఎన్నే అరోరా వ్యాక్సిన్కి సంబంధించి గుడ్ న్యూస్ తెలిపారు.
ఈ క్యాన్సర్కు కారణం అవుతున్న హ్యుమన్ పాపిల్లోమా వైరస్ నివారణకు సెర్పవాక్ వ్యాక్సిన్ను అభివృద్ది చేస్తున్నట్లు డాక్టర్ ఎన్నే అరోరా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలిపారు. చాలా తక్కువ ధరకే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ వల్ల ఇండియాలో చాలామంది మహిళలు మృతి చెందుతున్నట్లు చెబుతున్నారు.
గర్బాశయ క్యాన్సర్ను నిరోధించే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. క్యాన్సర్ మరణాలు తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు,. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 80 వేల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు డాక్టర్ అరోరా చెప్పారు. ఇంియా రెండు, మూడు వ్యాక్సిన్లను అభివృద్ది చేస్తుండగా.. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభవృద్ది చేస్తున్న వ్యాక్సిన్కు అనుమతి వచ్చినట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఇండియాలో వచ్చే ఏడాది అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు.
Tags
Related News
Nigeria: నైజీరియన్లను వణికిస్తున్న డిఫ్తీరియా
నైజీరియాలో చిన్నారుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా డిఫ్తీరియా వ్యాపిస్తోందని, దేశంలోని దాదాపు 22 లక్షల మంది చిన్నారులకు ఇంకా టీకాలు వేయలేదని ఐక్యరాజ్యసమితి బాలల నిధి, యునిసెఫ్ తెలిపింది.