Rahul Gandhi: నిరుద్యోగం, ధరల పెరుగుదలే పార్లమెంట్ దాడికి కారణం: రాహుల్ గాంధీ
పార్లమెంట్ దాడికి ధరలు పెరగడం, నిరుద్యోగం కారణమని రాహుల్ గాంధీ అన్నారు.
- By Balu J Published Date - 04:15 PM, Sat - 16 December 23

Rahul Gandhi: డిసెంబరు 13న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు ధరలు పెరగడం, నిరుద్యోగం కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం అన్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ గుజరాత్ యూనిట్ నేతలతో ఎన్నికల సంసిద్ధత సమావేశం అనంతరం గాంధీ విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన జరిగిందని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ విధానాల వల్ల యువతకు ఉద్యోగాలు రావడం లేదని అన్నారు.
‘‘పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన జరిగింది. అయితే అది ఎందుకు జరిగింది?” రాహుల్ ప్రశ్నించాడు. “దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఈ సమస్యతో యువత దేశవ్యాప్తంగా ఉడికిపోతోంది. మోదీ విధానాల వల్ల దేశ యువతకు ఉపాధి లభించడం లేదు’ రాహుల్ అన్నారు.
కాగా భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్షాలు ప్రభుత్వం నుండి సమాధానాలు కోరుతున్నాయి. పార్లమెంటులో ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ప్రకటనను డిమాండ్ చేశాయి. డిమాండ్ కోసం ఒత్తిడి తెచ్చేందుకు ఉభయ సభల కార్యక్రమాలను కూడా అడ్డుకున్నారు.