Rahul Gandhi: మోడీ పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు .. సూరత్ కోర్టు కీలక తీర్పు
క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది.
- By Balu J Published Date - 11:31 AM, Thu - 23 March 23
2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. కర్ణాటకలోని కోలార్లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దొంగలందరికీ మోడీ సాధారణ ఇంటిపేరు వచ్చిందని కామెంట్స్ చేశారు. తీర్పు వెలువడే సమయంలో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది.
అనిల్ అంబానీకి మోడీ రూ. 30 వేల కోట్లను దోచిపెట్టారని రాహుల్ ఆరోపించారు. మోడీ కాపలాదారుడే కాదు దొంగ కూడా అన్నారు. రాహుల్ గాంధీపై గుజరాత్ మంత్రి పూర్ణేష్ మోడీ కేసు పెట్టారు. రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరుకావాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదుదారు చేసిన పిటిషన్పై మార్చి 2022లో విచారణపై విధించిన మధ్యంతర స్టేను గుజరాత్ హైకోర్టు తొలగించిన తర్వాత ఫిబ్రవరి 2023లో ఈ కేసులో తుది వాదనలు తిరిగి ప్రారంభమవుతాయి. కాగా 2019 లో మోడీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరువు నష్టం దావా కేసు లో రాహుల్ గాంధీ కి 2 ఏళ్ల జైల్ శిక్ష విధించిన సూరత్ కోర్టు.. రాహుల్ నీ దోషి గా తేల్చిసింది.
Tags
Related News
Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..
2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.