Parliament: నవంబర్ లో కాదు…డిసెంబర్ లో పార్లమెంట్ సమావేశాలు..ఎందుకంటే.!!
- By hashtagu Published Date - 08:06 AM, Sat - 12 November 22
సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రతిఏటా నవంబర్ మూడవ వారంలో ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి సమావేశాలు డిసెంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ సారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలపై పార్లమెంటరీ కేబినెట్ కమిటీ తుది, అధికార నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…ఈ శీతాకాల సమావేశాలు పార్లమెంట్ భవనంలోని పాత భవనంలో జరిగే అవకాశం ఉంది. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ కొత్త భవనం లాంఛనప్రాయ ప్రారంభోత్సవం కూడా ఉంది. వచ్చే ఏడాది మొదటి సెషన్ అనగా బడ్జెట్ సెషన్ను కొత్త పార్లమెంట్ భవన్ లో నిర్వహించే అవకాశం ఉంది.
కాగా డిసెంబర్ మొదటి వారంలో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్, ఆప్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీల కారణంగా ఈ సారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఓటింగ్ తర్వాత అనగా డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Related News
Etela : ప్రధాని మోడీ బ్రతికితే ప్రజల కోసమే..చనిపోతే ప్రజల కోసమేః ఈటెల
Etela Rajender: మాల్కాజ్ గిరి బీజేపీ(bjp) అభ్యర్థి ఈటెల రాజేందర్(Etela Rajender) ఈరోజు బోడుప్పల్(Boduppal), వివేకానందనగర్ వాసులతో బ్రేక్ఫాస్టు మీటింగులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ స్కాములే..అందుకే బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. సాధారణంగా మామూలు ఉద్యోగులు ఏమనుకుంటారో నాకు తెలుసు. వారికి రాజకీయాలంటే అంత ఆసక్తి ఉండదు. వారి వృత్తి , వ్యాపారాలలో బిజీగా ఉంటా�