Rajasthan: 42 ఏళ్ల వయసులో అదృశ్యం.. 33 ఏళ్ల తర్వాత మళ్లీ అలా.. చివరికి?
సాధారణంగా చిన్నపిల్లలు లేదంటే పెద్దవాళ్లు తప్పిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్లు అయితే కాస్త ఆలస్యంగా నైనా ఇంటికి తిరిగి చేరుకుంటూ ఉం
- By Nakshatra Published Date - 08:00 PM, Fri - 2 June 23
సాధారణంగా చిన్నపిల్లలు లేదంటే పెద్దవాళ్లు తప్పిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్లు అయితే కాస్త ఆలస్యంగా నైనా ఇంటికి తిరిగి చేరుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అలా తప్పిపోయిన వారి జాడ నెలలు సంవత్సరాల తరబడి వెతికినా కూడా కనిపించకుండా పోవడంతో వారిపై ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు. అలా కనిపించకుండా పోయిన వారు చాలామంది బతికి ఉన్నారు లేదంటే చనిపోయినారు తెలియని సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
రాజస్థాన్ లో ఒక వృద్ధుడు గతంలో కనిపించకుండా పోయి చివరికి 33 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగివచ్చాడు. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా బన్సూర్ గ్రామానికి చెందిన హనుమాన్ సైనీ అనే 75 ఏళ్ల వృద్ధుడు 1989లో ఢిల్లీలోని ఒక దుకాణంలో పనిలో చేరాడు. అప్పటికి అతని వయసు 42 ఏళ్లు. అయితే అదే సంవత్సరం అతను ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి హిమాచల్ప్రదేశ్ లోని కాంగ్రాకు వెళ్లిపోయాడు. తర్వాత అక్కడే ఉన్న ఒక మాతా మందిరంలో పూజలు చేస్తూ గడిపాడు. దాదాపు 33 ఏళ్ల పాటు ఆ ప్రాంతంలోనే గడిపాడు.
చివరికి 75 ఏళ్ల వయసులో అక్కడి నుంచి తన స్వగ్రామమైన బన్సూర్కు వచ్చేశాడు. చాలాకాలం తర్వాత హనుమాన్ సైనీ ఇంటికి రావడంతో తన కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. చాలా ఏళ్ల తర్వాత పెద్దాయన తిరిగిరావడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆనందపడిపోయారు. కానీ ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ఇంటి నుంచి వెళ్లిపోయి దాదాపు 33 ఏళ్ల పాటు తిరిగి రాకపోవడంతో అతడు చనిపోయారు అని భావించిన కుటుంబ సభ్యులు గత ఏడాది మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. అయితే ఎట్టకేలకు అతను తిరిగిరావడంతో సంతోషంలో మునిగిపోయారు.
Related News
PM Modi: అంబేడ్కర్ మళ్లీ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు: మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. సోనియా గాంధీ మాట్లాడుతూ.. మోడీ దేశ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని సోనియా గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.