223 Employees Sacked : 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగుల తొలగింపు.. సంచలన ఆదేశాలు
223 Employees Sacked : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన ఆదేశాలు ఇచ్చారు.
- By Pasha Published Date - 12:18 PM, Thu - 2 May 24
223 Employees Sacked : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీ మహిళా కమిషన్లోని 223 మంది ఉద్యోగులను తక్షణమే తొలగిస్తూ ఆయన ఆర్డర్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఈ ఉద్యోగులను నియమించారని లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. ఢిల్లీ మహిళా కమిషన్కు 40 పోస్టులే మంజూరవగా.. స్వాతి మలివాల్ ఛైర్పర్సన్గా ఉన్న టైంలో ఏకంగా 223 మందిని నియమించారని చెప్పారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకునే అధికారం ఢిల్లీ మహిళా కమిషన్కు లేదని ఆయన స్పష్టం చేశారు.
223 employees from the Delhi Women Commission have been removed with immediate effect on the order of Lieutenant Governor VK Saxena. It is alleged that the then chairperson of the Delhi Women Commission, Swati Maliwal, had appointed them without permission, going against the… pic.twitter.com/wMZmaTuX9l
— ANI (@ANI) May 2, 2024
We’re now on WhatsApp. Click to Join
పరిమితికి మించి ఉద్యోగులను నియమించుకునే ముందు.. అదనపు ఆర్థిక భారంపై, తీసుకోవాల్సిన అనుమతులపై సమీక్ష జరగలేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెల్లడించారు. అందుకే సంస్థ శ్రేయస్సు కోసం 223 మంది ఉద్యోగులను తీసేశామని(223 Employees Sacked) తెలిపారు. ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ తర్వాతే ఉద్యోగులను తొలగించాలని డిసైడ్ అయ్యామన్నారు. ఈ ఆరోపణలపై స్వాతి మలివాల్ ఇంకా స్పందించలేదు. దీంతో ఆప్ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మధ్యనున్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. కాగా, స్వాతి మలివాల్ ఆప్ తరపున రాజ్యసభకు నామినేట్ కావడంతో ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ మహిళా కమిషన్ పదవికి రిజైన్ చేశారు.