INS Vikrant: విక్రాంత్ రిటర్న్స్
INS విక్రాంత్ .. 1971 భారత్ పాకిస్థాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన విమాన వాహక నౌక. 1997లో రిటైర్ అయ్యింది.
- By Naresh Kumar Published Date - 12:19 AM, Fri - 2 September 22
INS విక్రాంత్ .. 1971 భారత్ పాకిస్థాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన విమాన వాహక నౌక. 1997లో రిటైర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ నౌకాదళంలోకి ఎంట్రీ ఇస్తోంది సరికొత్త INS విక్రాంత్. పూర్తిగా దేశీయంగా నిర్మితమైందీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్.
దేశీయంగా నిర్మించిన తొలి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ను శుక్రవారం ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ రూపొందించిన INS విక్రాంత్ను.. కొచ్చి షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. రక్షణరంగంలో ఆత్మనిర్భర భారత్లో భాగంగా పూర్తిగా దేశీయంగా నిర్మితమైంది. 100 MSMEలు ఇందుకోసం విడిభాగాలు సమకూర్చాయి.37వేల500 టన్నుల బరువున్న ఈ యుద్ధనౌక పొడవు 262 మీటర్లు. వెడల్పు 62 మీటర్లు. సముద్ర తలానికి 30 మీటర్ల లోతులో ఉంటుంది. 14 డెక్స్ ఉంటాయి. 2300 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. 1,700 మంది సిబ్బంది పని చేయవచ్చు. 28నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
The countdown begins! #INSVikrant will be a city on move from 2nd Sep. pic.twitter.com/bSPr6HT3UH
— Resonant News🌍 (@Resonant_News) August 31, 2022
ఒక్కసారి ఇంధనం నింపుకొంటే 7,500 నాటికల్ మైళ్ల దూరం అంటే భారత సముద్ర తీరం మొత్తాన్ని రెండుసార్లు చుట్టేయగలదు. INS విక్రాంత్ నిర్మాణం 2006లో ప్రారంభమైంది. దాదాపు రూ.20,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నౌకలో.. 18అంతస్తులు ఉంటాయి. మిగ్-29 యుద్ధ విమానాలు, కమోవ్-31 హెలికాప్టర్లు, ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్లు, తేలికపాటి హెలికాప్టర్లను ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. 1971 వార్లో కీలక భూమిక పోషించిన భారత తొలి విమాన వాహక నౌక INS విక్రాంత్ పేరునే.. దేశీయంగా తయారుచేసిన తొలి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కు ఇండియన్ నావీ పెట్టింది. INS విక్రాంత్ను కమిషన్లో పాల్గొనడంతోపాటు భారత నావీకా దళం నూతన ఎన్సైన్ను ఆవిష్కరించనున్నారు ప్రధాని మోదీ. వలసవాద గతాన్ని తొలగించి, సుసంపన్నమైన భారతీయ సముద్ర వారసత్వానికి తగినట్లుగా కొత్త నౌకాదళ ఎన్సైన్ ఉంటుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
Tomorrow, 2nd September is a landmark day for India’s efforts to become Aatmanirbhar in the defence sector. The first indigenously designed and built aircraft carrier INS Vikrant will be commissioned. The new Naval Ensign (Nishaan) will also be unveiled.
— Narendra Modi (@narendramodi) September 1, 2022
నావల్ ఎన్సైన్ అనేది నౌకాదళ నౌకలు లేదా నిర్మాణాలు తమ జాతీయతను సూచించడానికి తీసుకువెళ్లే జెండా. ప్రస్తుత భారత నౌకాదళ నిషాన్లో సెయింట్ జార్జ్ క్రాస్ ఉంది. 2001లో వాజ్పేయి ప్రభుత్వం ప్రభుత్వం నీలిరంగులో ఉండే భారత నౌకాదళ జెండాతో దీనిని మార్చింది. 2004లో మళ్లీ సెయింట్ జార్జ్ క్రాస్ను పునరుద్ధరించింది యూపీఏ సర్కార్.
On the eve of INS Vikrant commissioning tomorrow, a quick look…
…onboard the INS Vikramaditya aircraft carrier not too long ago. Some photos of our wonderful trip.
Picture 1 will be history tomorrow onwards. pic.twitter.com/0pRVmidaDu
— Vayu Aerospace Review (@ReviewVayu) September 1, 2022
A legend rises again. First indigenous Aircraft Carrier INS Vikrant 🇮🇳🫡. Commissioning Day tomorrow. Jai Hind 🇮🇳🙏🏻 #IndianNavy pic.twitter.com/oIKOA6WsQ5
— Prem Mohanty (@philipbkk) September 1, 2022
Tags
Related News
Lok Sabha Election 2024: సిట్టింగ్ ఎంపీలలో 44% మంది క్రిమినల్సే: ఏడీఆర్ రిపోర్ట్
514 మంది సిట్టింగ్ ఎంపీలలో 225 మంది అంటే 44 శాతం మంది ఎంపీలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఏడీఆర్ ప్రకారం 514 మంది సిట్టింగ్ ఎంపీలలో 225 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని తెలిపింది.