Rahul Gandhi : ఇద్దరూ ఇద్దరే: రాజస్తాన్ ఎపిసోడ్ పై రాహుల్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని రాహుల్ గాంధీ అన్నారు.
- By Hashtag U Published Date - 04:19 PM, Mon - 28 November 22
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని రాహుల్ గాంధీ అన్నారు. వాళ్లిద్దరి మధ్య విభేదాలపై రాహుల్ గాంధీ సున్నితంగా స్పందించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇండోర్లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఇద్దరి మధ్యా జరుగుతోన్న ఉన్న గ్యాప్ ను వివాదంగా సృష్టించకూడదని అన్నారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్న భారత్ జోడో యాత్ర షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4న రాజస్థాన్లోకి ప్రవేశిస్తుంది. కమల్నాథ్ ప్రభుత్వం కూలిపోవడానికి 2022లో కారణమైన బీజేపీకి అండగా నిలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రాహుల్ స్పందించారు. వాళ్లకు మళ్లీ పార్టీలో స్థానం ఇవ్వకూడదని అన్నారు. జనరల్ కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్పై అభిప్రాయంపై వేసిన ప్రశ్నను ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రపై పూర్తి దృష్టి పెట్టానని, మరే ఇతర రాజకీయ అంశంపై స్పందించనని రాహుల్ గాంధీ అన్నారు.
‘భారత్ జోడో యాత్ర కాంగ్రెస్పై ఎలాంటి ప్రభావం చూపుతుందా? మరి ఏ స్థాయిలో? నేను ఈ విషయాలన్నీ ఆలోచించడం లేదని రాహుల్ అన్నారు. ప్రతిరోజూ 25 కిలోమీటర్లు యాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నాను. వారి మాటలు వింటున్నానని అన్నారు.
Related News
Rahul Gandhi : బిలియనీర్ మిత్రుల కోసం రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ – రాహుల్
ఈ డబ్బుతో ప్రతి ఏడాది 16 కోట్ల మంది ఉద్యోగులకు లక్ష ఇచ్చేవాళ్లమని , 16 కోట్ల మంది మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తే వాళ్ల జీవితాలు మారిపోయి ఉండేవన్నారు