Uttarakhand : ఉత్తరాఖండ్ లో ఘోరరోడ్డు ప్రమాదం..కాలువలో పడిన వాహనం,12 మంది దుర్మరణం..!!
- By hashtagu Published Date - 08:13 PM, Fri - 18 November 22
ఉత్తరాఖండ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. జోషిమత్ లో జరిగిన ఈ ప్రమాదంలో 12మంది మరణించారు. జోషిమత్ బ్లాక్ లోని ఉర్గాం పల్ల జఖోల మోటార్ వే పై ఓ వాహనం ఆకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి కాలువలో పడిపోయింది. అందులో 10 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న NDFR, SDRF బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికి తీశారు. అయితే ఆ వాహనంలో ఎంతమంది ఉన్నారనేదానిపై స్పష్టత లేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
ఈ ఘటనపై సీఎం ధామి సంతాపం వ్యక్తం చేశారు. రెస్య్కూ ఆపరేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని వీలైనంత వరకు క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు.
Tags
Related News
Lok Sabha Elections: 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభం.. పలు సంస్థలకు సెలవులు
శుక్రవారం (ఏప్రిల్ 19, 2024) లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) మొదటి దశ 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ 102 సీట్లు 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి.