Death Claim : పీఎఫ్ ‘డెత్ క్లెయిమ్’లకు ఇక అది అక్కర్లేదు
‘ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా’కు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే కీలక నిర్ణయాన్ని ఈపీఎఫ్వో తీసుకుంది.
- By Pasha Published Date - 08:24 AM, Mon - 20 May 24
Death Claim : ‘ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా’కు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే కీలక నిర్ణయాన్ని ఈపీఎఫ్వో తీసుకుంది. పీఎఫ్ అకౌంటుకు ఆధార్ నంబర్ను లింక్ చేయకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లను పరిష్కరించేందుకు కీలక వెసులుబాటును కల్పించింది. మరణించిన ఈపీఎఫ్వో సభ్యుల కేసుల్లో ఆధార్ లింక్ లేకున్నా.. డెత్ క్లెయిమ్(Death Claim) చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఈపీఎఫ్వో ప్రకటించింది. ఈపీఎఫ్వో సభ్యుడు చనిపోయాక ఆధార్ కార్డు వివరాల్లో మార్పులు చేయడం కష్టమని.. అందుకే ఇలాంటి కేసుల్లో ఆధార్ నంబరు లింకు లేకున్నా క్లెయిమ్లు ప్రాసెస్ చేయాలని తమ అధికారులకు నిర్దేశించింది. ఈ వివరాలను ఈ-ఆఫీస్ దస్త్రం కింద ఇన్ఛార్జి అధికారి పరిశీలించి, నిజమైన క్లెయిమ్లుగా గుర్తించిన తర్వాతే ప్రాసెస్ చేయాలని ఈపీఎఫ్వో స్పష్టం చేసింది. పీఎఫ్ ఖాతా వివరాలన్నీ కరెక్టుగా ఉన్నప్పటికీ, ఆధార్ వివరాలు అసంపూర్తిగా ఉన్న కేసులకే ఈ నిబంధనను వర్తింపజేయాలని తెలిపింది.ఆధార్ వివరాలు సక్రమంగా ఉండి, పీఎఫ్ ఖాతాలో సమాచారం అసంపూర్తిగా ఉన్న సందర్భాల్లో ఈపీఎఫ్వో నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరించాలని సూచించింది. ఈ మేరకు ఈపీఎఫ్వో అదనపు ప్రధాన కమిషనర్ ఎంఎస్కేవీవీ సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు.
We’re now on WhatsApp. Click to Join
- ఉద్యోగులు తీసుకునే వేతనాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) కూడా భాగమే. ఆయా కంపెనీల యాజమాన్యాలు.. సిబ్బంది జీతాల నుంచి కొంత సొమ్మును మినహాయించి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తాయి. తమ వాటాగా కూడా అంతే మొత్తాన్ని డిపాజిట్ చేస్తాయి.
- పీఎఫ్ ఖాతాలను సదరు కంపెనీల ట్రస్టులుగానీ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో)గానీ నిర్వహిస్తాయి.
- ఒకవేళ జీతాలిచ్చే కంపెనీకే పీఎఫ్ ట్రస్టు ఉంటే.. అది ‘ఎగ్జెంప్టెడ్’ లేదా ‘అన్ఎగ్జెంప్టెడ్’ అనేది కీలకం. ఎగ్జెంప్టెడ్ ట్రస్టు ఈపీఎఫ్వో, ఐటీ శాఖల గుర్తింపు పొంది ఉంటుంది. దీంతో ఉద్యోగుల సొమ్ము నిర్వహణకు నిర్ణీత ఈపీఎఫ్వో నిబంధనలను ఈ ట్రస్టులు పాటించాలి.
- అన్ఎగ్జెంప్టెడ్ ట్రస్టుకు అటు ఈపీఎఫ్వోగానీ, ఇటు ఐటీ శాఖ నుంచిగానీ ఏ రకమైన గుర్తింపులు ఉండవు. కాబట్టి మీ పీఎఫ్ ఖాతా.. ఈపీఎఫ్వోలో లేదా ఎగ్జెంప్టెడ్ ట్రస్టులోనో ఉంటేనే వివిధ పన్ను మినహాయింపులకు మీకు అర్హత ఉంటుంది. తన ఈపీఎఫ్ విరాళంపై సెక్షన్ 80సీ మినహాయింపును ఉద్యోగి అప్పుడే క్లెయిం చేసుకోగలరు.
- ఈపీఎఫ్ విరాళాల సొమ్మును కంపెనీలు అన్ఎగ్జెంప్టెడ్ ట్రస్టుల్లో రెండు విధాలుగా జమ చేస్తాయి. ఉద్యోగుల వాటాలోకి కొంత, సంస్థ వాటాలోకి ఇంకొంత డిపాజిట్ చేస్తాయి. ఈ రెండింటిపైనా వడ్డీ ఆదాయం ఉంటుంది.
Also Read : Lok Sabha Elections 2024 : ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. కొత్త రికార్డు సృష్టించాలని ఓటర్లకు ప్రధాని పిలుపు
Related News
New EPF Rule: పీఎఫ్ చందదారులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు విత్డ్రా..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో తన ఖాతాదారులకు పెద్ద ఊరటనిచ్చింది.