Dharmasthala : ఇది పుణ్యక్షేత్రమా..? స్మశాన వాటికా..? – CPI నారాయణ
Dharmasthala : దాదాపు 500 మంది అమ్మాయిలపై లైంగిక దాడులు చేసి, హత్య చేసి పూడ్చిపెట్టారని ఆయన ఆరోపించారు. ఈ దారుణాలపై వెంటనే విచారణ జరిపించి, ధర్మస్థల ట్రస్ట్ ఛైర్మన్, సభ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు
- By Sudheer Published Date - 03:39 PM, Sat - 9 August 25

ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల(Dharmasthala )లో జరుగుతున్న మిస్టరీ హత్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 500 మంది అమ్మాయిలపై లైంగిక దాడులు చేసి, హత్య చేసి పూడ్చిపెట్టారని ఆయన ఆరోపించారు. ఈ దారుణాలపై వెంటనే విచారణ జరిపించి, ధర్మస్థల ట్రస్ట్ ఛైర్మన్, సభ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి.
Mahesh Babu Birthday Special: రాజమౌళి ఇచ్చిన స్పెషల్ అప్డేట్, పోస్టర్ అదిరిపోయింది!
ధర్మస్థల ట్రస్ట్ ఒకే కుటుంబం చేతిలో ఉందని నారాయణ ఆరోపించారు. ప్రతి సంవత్సరం ట్రస్ట్కు రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని, దానిపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. దేవస్థానాన్ని ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తవ్వేకొద్దీ ఎముకలు, పుర్రెలు బయటపడుతున్నాయని, అది దేవస్థానమా లేక శ్మశానమా అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసు విచారణలో పారదర్శకత లేదని ఆయన ఆరోపించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే ఈ కేసు విచారణకు సిట్ (Special Investigation Team) ఏర్పాటు చేశారని, అదే వేరే ప్రభుత్వం ఉంటే ఈ విషయం అసలు బయటకు వచ్చేది కాదని నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సిట్ విచారణ నిజాలను బయటపెడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, దోషులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.