Congress plenary : పొత్తులకు కాంగ్రెస్ పిలుపు! త్యాగాలకు సిద్ధమన్న ఖర్గే!!
భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ ప్లీనరీ(Congress plenary) .
- By CS Rao Published Date - 02:35 PM, Sat - 25 February 23
భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్లీనరీ(Congress plenary) వేదికగా అగ్రనేతలు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ విచ్ఛన్నం దిశగా వెళుతోందని, సమైక్యంగా దేశాన్ని ఉంచడానికి కాంగ్రెస్ త్యాగం(Alliance) చేయడానికి వెనుకాడదని వెల్లడించారు. ఆ మేరకు ఏఐసీపీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ప్లీనరీ వేదికగా ప్రకటించారు. కులం, మతం, ప్రాంతం, లింగ తదితర అంశాలను బేస్ చేసుకుని విద్వేషాలను లేపకుండా ఉండేలా నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ఈ ప్లీనరీ సంచలన తీర్మానం చేయనుంది. అంతేకాదు, కేవలం మూడు రాష్ట్రాల్లో 1998లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న కాంగ్రెస్ రాబోవు రోజుల్లో అధికారంలోకి రానుందని ఉత్సాహపరిచారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి కీలక మలుపుగా ఏఐసీపీ మాజీ ఛీప్ సోనియా కొనియాడారు.
భావసారూప్యత ఉన్న పార్టీలతో సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్లీనరీ(Congress plenary)
ప్లీనరీ రెండో రోజు రాయ్ పూర్ అడుగుపెట్టిన ప్రియాంకగాంధీకి ఘనస్వాగతం పలకడం ప్రత్యేకంగా కనిపించింది. రెండు కిలోమీటర్ల మేర 6వేల కిలోలకు పైగా గులాబీలతో ఆమె నడిచే రోడ్డుకు ఇరువైపులా అలంకరించడం విశేషం. దారి పొడవునా జానపద కళాకారులు రంగురంగుల సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శనలు ఇస్తూ ప్రియాంకను స్వాగతించారు. ఉదయం 8.30 గంటలకు స్వామి వివేకానంద విమానాశ్రయానికి చేరుకున్న ప్రియాంక గాంధీ వాద్రాను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మోహన్ మార్కం మరియు ఇతర పార్టీ నాయకులు ఆమెకు స్వాగతం పలకడం ప్రత్యేకతను సంతరించుకుంది.
భారత్ జోడో యాత్ర మరో మలుపుగా సోనియా గాంధీ
ప్లీనరీ వేదికగా (Congress plenary) కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్కు కీలక మలుపుగా అభివర్ణించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సమర్థ నాయకత్వంతో పాటు 2004 మరియు 2009లో కాంగ్రెస్ విజయాలు సంతృప్తి ఇచ్చినట్టు గుర్తు చేసుకున్నారు. అంతకంటే, భారత్ జోడో యాత్ర మరో మలుపుగా సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికి ప్రస్తుతం సవాల్ తో కూడుకున్న సమయమని చెప్పారు. వ్యవస్థలను ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ కబ్జా చేసిన క్లిష్టపరిస్థితి దేశంలో ఉందని అభిప్రాయపడ్డారు. విద్వేషాలను బీజేపీ రగిలిస్తోందని, బీజేపీ పార్టీ మైనారిటీలు, మహిళలు, దళితులు, గిరిజనులను దుర్మార్గంగా లక్ష్యంగా చేసుకుందని అన్నారు. శక్తివంతంగా బీజేపీని ఎదుర్కోవడం ద్వారా ప్రజలకు చేరువ కావాలని ఆమె దిశానిర్దేశం చేశారు.
బీజేపీని ఓడించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు(Alliance)
సోనియా కంటే ముందే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, బీజేపీని ఓడించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు(Alliance) పెట్టుకోవాలని కాంగ్రెస్ మరోసారి ఎదురుచూస్తోందని పిలుపునిచ్చారు. అందుకోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాషాయ పార్టీపై ఘాటైన దాడిని ప్రారంభించిన ఆయన “దేశ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడానికి బిజెపి కుట్ర పన్నిందని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ భారతదేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. భారత్ జోడో యాత్రను చేపట్టి రాహుల్ గాంధీ , 22 ఏళ్లుగా పార్టీని నడిపించిన మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డబ్బు సంచుల ద్వారా ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ సహాయంతో ప్రభుత్వాలను మార్చడం తమ లక్ష్యం కాదని కాంగ్రెస్ చీఫ్ నొక్కిచెప్పారు.
ప్రియాంక గాంధీ వాద్రాకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం
సెషన్(Congress plenary) ప్రారంభంలో ఒక పుస్తకాన్ని ఖర్గే విడుదల చేశాడు. పార్టీ ప్రధాన కార్యదర్శులు తమ నివేదికలను పార్టీ అధినేతకు సమర్పించారు. రాజకీయ, ఆర్థిక మరియు అంతర్జాతీయ వ్యవహారాల తీర్మానాలను ప్రతినిధులు చర్చిస్తారు. ప్లీనరీ వేదిక వద్దకు చేరుకున్న వెంటనే పార్టీ అధినేత ఖర్గే పార్టీ జెండాను ఎగురవేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు శనివారం ఉదయం రాయ్పూర్ చేరుకున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సిటీ ఎయిర్పోర్టు ముందు రోడ్డులో ఆమె కోసం గులాబీ రేకులతో కార్పెట్ వేయబడింది. రెండు కిలోమీటర్ల మేర రోడ్డును అలంకరించేందుకు 6,000 కిలోలకు పైగా గులాబీలను ఉపయోగించారు. దారి పొడవునా జానపద కళాకారులు రంగురంగుల సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శనలు ద్వారా ఆమెకు స్వాగతం పలికారు.
Also Read : Congress plenary:CWCనిబంధన సడలింపు!తొలి రోజు ప్లీనరీ సందడి!
పార్టీ నేతలను ఉద్దేశించి ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ మాట్లాడుతూ.. ఈ సదస్సు ఛత్తీస్గఢ్లో జరగడం మా అదృష్టమన్నారు. దేశం ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగంతో పోరాడుతున్న తరుణంలో దీనిని నిర్వహిస్తున్నారని అన్నారు. రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాలతో సంబంధాలు సరిగా లేవని, ఇలాంటి పరిస్థితుల్లో దేశం దృష్టి రాహుల్ గాంధీపైనే ఉందని అభిప్రాయపడ్డారు.
56 పాయింట్ల రాజకీయ తీర్మానంలో`వివక్ష నిరోధక చట్టాన్ని
కాంగ్రెస్ ప్లీనరీలో(Congress plenary) ఆమోదించబోయే 56 పాయింట్ల రాజకీయ తీర్మానంలో భాగంగా దేశంలో ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టాన్ని ప్రతిపాదించే అవకాశం ఉంది. మతం, కులం, లింగం లేదా భాష ఆధారంగా వివక్షను నిషేధించడానికి `వివక్ష నిరోధక చట్టాన్ని` ఆమోదించడానికి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. భయాందోళనలు సృష్టించే ప్రత్యక్ష మరియు పరోక్ష చర్యల ద్వారా న్యాయవ్యవస్థ నిరంతరం బెదిరింపులకు గురవుతోందని, న్యాయ మంత్రి స్వయంగా కఠోరమైన చర్యలకు నాయకత్వం వహిస్తున్నారని ఎత్తిచూపిన కాంగ్రెస్, న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం మరియు సమగ్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడేలా చూస్తామని హామీ ఇచ్చింది.
Also Read : Delhi Airport : ప్లీనరీకి వెళ్లే లీడర్లపై పోలీసింగ్, విమానం నుంచి పవన్ దించివేత!
మూడు రోజుల సదస్సులో మొదటి రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)కి ఎన్నికలు నిర్వహించకూడదని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. మూడు గంటలపాటు జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం కాంగ్రెస్ కమ్యూనికేషన్ హెడ్ జైరాం రమేష్ మాట్లాడుతూ, సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేసేందుకు ఖర్గేకు అధికారం ఇవ్వాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. కాగా, ఈ సమావేశానికి సోనియా, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు గైర్హాజరు కావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. సభ్యులను నామినేట్ చేయడానికి పార్టీ చీఫ్ ఖర్గేకు అధికారం ఇవ్వాలనేది ఆధిపత్య మరియు అధిక అభిప్రాయం అని రమేష్ అన్నారు. పార్టీ విజయవంతంగా ప్రకటించిన భారత్ జోడో యాత్ర నేపథ్యంలో నడుస్తోన్న ఈ సెషన్కు దాదాపు 15,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ ప్లీనరీ 2024తో సహా రాబోయే ఎన్నికల పోరాటాలకు(Alliance) పార్టీకి దిశానిర్దేశం ఇవ్వనుంది.
Related News
Indira Gandhi : దేశం కోసం ఇందిరాగాంధీ నగలిచ్చారా ? ప్రధాని మోడీ ‘మంగళసూత్రాల’ ఆరోపణ నిజమేనా ?
Indira Gandhi : ఈ ఎన్నికల వేళ దేశంలో ప్రస్తుతం ఇద్దరు నేతల ప్రసంగాలపై అంతటా హాట్ డిబేట్ జరుగుతోంది.