2006 Jobs : టైపింగ్ వచ్చా.. 2006 కేంద్ర ప్రభుత్వ జాబ్స్ మీకోసమే!
స్టెనోగ్రఫీ తెలిసి ఉండి.. ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్. కేంద్రప్రభుత్వ ఉద్యోగం(2006 Jobs) పొందే గొప్ప అవకాశం.
- By Pasha Published Date - 11:20 AM, Wed - 31 July 24

2006 Jobs : స్టెనోగ్రఫీ తెలిసి ఉండి.. ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్. కేంద్రప్రభుత్వ ఉద్యోగం(2006 Jobs) పొందే గొప్ప అవకాశం. వివిద కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2006 స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. అయితే 02.08.1994 నుంచి 01.08.2006 మధ్య జన్మించిన వారే అర్హులు. స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-డి) పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. అయితే 01.08.2024 నుంచి 02.08.1997 మధ్య జన్మించి వారే అర్హులు.
We’re now on WhatsApp. Click to Join
- ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీల వారీగా 10-13-15 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్, డిఫెన్స్ పర్సనల్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, డిఫెన్స్ (డిసెబుల్డ్) పర్సనల్ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 8 సంవత్సరాల దాకా వయోపరిమితిలో సడలింపులు లభిస్తాయి.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 ఏళ్ల వరకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 45 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- వితంతు-విడాకులు-ఒంటరి మహిళలకు 35 ఏళ్ల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 40 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు దక్కుతుంది.
- అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్లు సమర్పించాలి. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
- దరఖాస్తుల సమర్పణకు లాస్ట్ డేట్ ఆగస్టు 17. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ ఆగస్టు 18. దరఖాస్తులలో తప్పుల సవరణకు ఆగస్టు 27 నుంచి 28వరకు అవకాశం కల్పించారు.
- అప్లై చేసే క్రమంలో ఏమైనా సందేహాలు వస్తే టోల్ఫ్రీ నంబరు 1800 309 3063కు కాల్ చేయొచ్చు.
Also Read :Comet Of The Century: భూమికి దగ్గరగా తోక చుక్క.. ఎప్పుడంటే..?
- రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియల ద్వారా ఈ జాబ్స్ను భర్తీ చేస్తారు.
- ఈ ఏడాది అక్టోబరు – నవంబరులో రాత పరీక్ష(Stenographer Posts) ఉంటుంది.
- రాత పరీక్ష ఆన్లైన్లో రెండు గంటల పాటు ఉంటుంది. 200 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయిస్తారు.
- ప్రత్యేక అవసరాలు కలిగిన అభ్యర్థులకు 40 నిమిషాలు ఎక్కువ టైం ఇస్తారు.
- హిందీ, ఇంగ్లిష్ మీడియంలలో ప్రశ్నలు ఉంటాయి.
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ విభాగం నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కులు కట్ చేస్తారు.
- పరీక్షలో కనీస అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 30 శాతంగా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25 శాతంగా, ఇతరులకు 20 శాతంగా నిర్ణయించారు.
- మన తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, వరంగల్లలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.