Plane Door Horror : ఇండియాలోనూ అలర్ట్.. ‘బోయింగ్ 737-9 మ్యాక్స్’ విమానాల కలవరం
Plane Door Horror : అమెరికాలో అలస్కా ఎయిర్లైన్స్కు చెందిన ‘బోయింగ్ 737-9 మ్యాక్స్’ విమానం టేకాఫ్ అయిన వెంటనే దాని కిటికీ ఊడిపోయిన ఘటన అందరినీ నివ్వెరపరిచింది.
- By Pasha Published Date - 08:10 AM, Sun - 7 January 24
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా అలర్ట్ అయింది. బోయింగ్ 737 MAX 9 విమాన సర్వీసులను వినియోగించే ముందు పూర్తిస్థాయి తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈ తనిఖీల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 171 ‘బోయింగ్ 737 MAX 9’ విమాన సర్వీసులు కొంత ప్రభావితమవుతాయని తెలిపింది. ఒక్కో విమానం తనిఖీకి నాలుగు నుంచి ఎనిమిది గంటల టైం పడుతుందని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక కిటికీ ఊడిపోయిన ఘటనను ఎదుర్కొన్న అలస్కా ఎయిర్లైన్స్ కూడా బోయింగ్ 737-9 మోడల్కు చెందిన 65 విమానాలను ఎయిర్పోర్టులకే పరిమితం చేసింది. ప్రస్తుతం తనిఖీలు(Plane Door Horror) చేస్తోంది.
Also Read: Uber Flex : ‘ఉబెర్ ఫ్లెక్స్’.. మీ రైడ్ ధరను మీరే డిసైడ్ చేసుకోవచ్చు
అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి ఒంటారియోకు బయలుదేరిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన తర్వాత 16 వేల అడుగుల ఎత్తులో ఉండగా..దానిలోని ఒక డోర్ ఊడిపడిపోయింది. దాంతో విమానం అత్యవసరంగా దిగింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సుక్షితంగా బయటపడటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ముందు విమానంలో పీడన సంబంధిత సమస్య తలెత్తిందని సిబ్బంది తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) ప్రకటించింది. ఈ విమానాన్ని అక్టోబర్లో అలస్కా సంస్థకు డెలివరీ చేశారు. నవంబర్లో ధ్రువీకరణ లభించిందని ఎఫ్ఏఏ డేటాతో తెలుస్తోంది. ఈ ఘటనపై బోయింగ్ సంస్థ కూడా స్పందించింది. ‘దీనిపై కస్టమర్తో సంప్రదింపులు జరుపుతున్నాం. మా టెక్నికల్ టీమ్ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉంది’ అని వెల్లడించింది.
Related News
Lok Sabha Polls 2024: లోక్సభ ఎన్నికల వేళ హెలికాప్టర్లకు భారీగా డిమాండ్
లోక్సభ ఎన్నికల మొదటి దశ ఇప్పటికే పూర్తి కావడంతో, మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో దాదాపు 80 శాతం ఉన్న మిగిలిన ఆరు దశలపై దృష్టి సారించింది. దీనికి ముందు రాజకీయ పార్టీలు ఛార్టర్ విమానాలు, హెలికాప్టర్లను కీలక సాధనాలుగా చేసుకుని ఓటర్లతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.