HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Huzurabad By Elections2021
  • >Govt Reopens Probe Into Huzurabad Mla Eatala Rajenders Assets

Etela Vs KCR : కేసీఆర్, ఈటెల ‘కేస్’ స్టడీ

హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కేసుల వైపు రాజకీయం మళ్లింది. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు.

  • By CS Rao Published Date - 12:56 PM, Wed - 10 November 21
  • daily-hunt

హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కేసుల వైపు రాజకీయం మళ్లింది. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు. అదే సమయంలో ఈటెల రాజేంద్ర పై ఉన్న అసైన్డ్ భూముల ఆక్రమణ కేసు ను తెలంగాణ ప్రభుత్వం బయటకు తీసింది. కేసీఆర్ అవినీతి మీద సీబీఐ కి ఫిర్యాదు చేస్తామని బీజేపీ చెబుతుంది. కేసులకు, ఈడీ, సీబీఐ లకు బయపడం అంటూ కేసీఆర్ మీడియా ముఖంగా పదే పదే చెప్పటం వెనుక ఏదో జరుగుతుఉందనే అనుమానాలకు తావిస్తోంది.

Also Read :తెలంగాణాలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది!

గతంలో ఓటుకు నోటు కేసు సమయంలో కూడా ఇలాగే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ చేత రేవంత్ పై కేసు నమోదు చేసి చంద్రబాబును టార్గెట్ చేసింది. ప్రతిగా ఫోన్ ట్యాపింగ్ కేసును ఏపీ పోలీసులు తెలంగాణ అధికారులపై పెట్టింది. చివరకు రెండు కేసులు ఏమయ్యాయో మనకు తెలుసు. ఇప్పుడు కేసీఆర్ పైన బీజేపీ కేసులు, ఈటెల పై తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టడం టిట్ ఫర్ టా ట్ లా ఉంది.
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల రాజేందర్‌పై మెదక్ జిల్లా అధికారులు మళ్లీ విరుచుకుపడ్డారు. రాజేందర్ భార్య జమున హేచరీస్‌ ఉన్న భూములను సర్వే చేయాలని మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 100 మంది రైతులకు నోటీసులు కూడా అందించారు. జూన్‌లో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం జమున హాట్‌చెరీస్‌కు చెందిన అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూములు, సీలింగ్ భూముల సర్వే చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఆధీనంలో ఉన్న భూమిని సర్వే చేయడాన్ని ప్రశ్నిస్తూ హేచరీస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. నోటీసు జారీ చేసిన తర్వాతే సర్వే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ ప్రకారం, కోవిడ్ కారణంగా అధికారులు సర్వే చేయలేకపోయారు. ఇప్పుడు తగిన విధానాన్ని అనుసరించి భూములను సర్వే చేయాలని నిర్ణయించుకున్నారు.సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ హేచరీస్ యజమానులకు, సుమారు 100 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. సంబంధిత భూములు అసైన్డ్ భూములా లేక సీలింగ్ భూములా అనేది పక్కాగా సర్వే చేసిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు.

Also Read :పక్కా స్కెచ్ తోనే కేసీఆర్ ప్రెస్ మీట్స్

నవంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు రెండు గ్రామాల్లో భూ సర్వే ఉంటుందని కలెక్టర్ వివరించారు. జమున హేచరీస్ ఉన్న స్థలంలో కొత్త సర్వే చేయడం లేదని, ఇంతకు ముందు ఆపివేసిన సర్వేను మాత్రమే కొనసాగిస్తున్నామని ” అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే జమున హేచరీస్‌పై ACB మరియు విజిలెన్స్ విచారణలను ప్రారంభించింది. గతంలో కూడా విజిలెన్స్ అధికారులు కొంతమంది రైతులను విచారించి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. ఇప్పుడు మళ్లీ హుజురాబాద్ ఉప పలితాలు వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈటెల కోసం రంగంలోకి దిగింది.టచ్ చేసి చూడండి అని బీజేపీ నేతలు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. జైలుకు పంపించే దమ్ము ఉందా అంటూ విరుచుకు పడ్డాడు. బీజేపీ తెలంగాణ నేతలపై కేసీఆర్ దూకుడుగా వెళ్తున్నాడు. అలాంటి దూకుడును ఈటెల మీద మరింత ఎక్కువగా ప్రదర్శిస్తున్నాడు. బీజేపీ నేతల ఆరోపణలకు కళ్లెం వేయడానికి ఇలా చేస్తున్నాడా? లేక కేసుకు..కేసు నమూనా లో కేసీఆర్ వెళ్తున్నాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • Eatala vs KCR
  • etela rajender

Related News

Kaleshwaram issue reaches Delhi.. Telangana government writes to the Center

Kaleshwaram Project : ఢిల్లీకి చేరిన కాళేశ్వరం వ్యవహారం..కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కమిషన్ సమర్పించిన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి రూ. వేల కోట్ల విలువైన బిల్లులు చెల్లింపులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని కమిషన్ వివరించింది.

  • Cbi Kcr

    CBI Enquiry on Kaleshwaram Project : కేసీఆర్ పై యాక్షన్ ..? బిజెపి భయపడుతోందా..? కారణం అదేనా..?

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd