Curd in Summer: ఏంటి.. ప్రతిరోజు పెరుగు తింటే అలాంటి సమస్యలు వస్తాయా?
పెరుగును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే చా
- By Nakshatra Published Date - 09:00 PM, Sun - 20 August 23
పెరుగును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే చాలామంది వేసవి వచ్చింది అంటేచాలు పెరుగు లేదా మజ్జిగను ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటారు. పెరుగు ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. పెరుగును తీసుకోవడం వల్ల అందులో ఉండే కాల్షియం ఎముకలను దంతాలను బలంగా చేస్తుంది. అలాగే పెరుగు కఫం, వాతం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. పెరుగు తినడం మంచిదే కదా అని ప్రతి రోజు పెరుగుతుంటే మాత్రం సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.
అదేంటి అనుకుంటున్నారా.. మరి పెరుగు ప్రతి రోజు తినడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవిలో పొట్ట ఆరోగ్యంగా, చల్లగా ఉండాలని చాలా మంది పెరుగు తినాలని చెబుతుంటారు. పెరుగు ప్రోబయోటిక్స్, న్యూట్రిషన్తో కూడిన ఆహారం. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి, ఇతర ముఖ్య పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. కొంతమందికి పెరుగు తింటే మొటిమలు, స్కిన్ అలర్జీ, జీర్ణ సమస్యలు పెరుగు తిన్న తర్వాత ఎక్కువగా వేడిగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పెరుగు తింటే సాధారణంగా శరీరం చల్లబడుతుంది. కానీ, ఇది వేడెక్కడం వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఎండాకాలంలో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బాడీలో కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. సాధారణంగా వ్యక్తికి వాత, పిత్త, కఫా దోషాలు ఉంటాయి. అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. పెరుగు రుచిలో పుల్లని, వేడిగా ఉంటుంది. జీర్ణం చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది.
ఇది కఫ, పిత్త దోషాలలో ఎక్కువగా ఉంటుంది. వాత దోషంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఏ సీజన్లో అయినా, పెరుగు తినేటప్పుడు కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. ఎండాకాలంలో పెరుగుని హెల్దీ అని తీసుకుంటారు. దీని వల్ల మొటిమలు, ఇతర సమస్యలు ముఖంపై కనిపిస్తాయి. పెరుగు సరిగ్గా తీసుకుంటే ఎలాంటి నష్టాలు ఉండవు. పెరుగు శరీరంలో వేడి పెంచుతుంది. కాబట్టి, రెగ్యులర్గా తినొద్దు. కానీ, ఇందులో రాళ్ళ ఉప్పు, కారం, జీలకర్ర వంటివి కలిపి మజ్జిగలా తీసుకోవచ్చు. పెరుగులో నీరు కలిసినప్పుడు అది వేడి ప్రభావాలను బ్యాలెన్స్ చేస్తుంది. నీరు వేడిని తగ్గిస్తుంది. పెరుగుకి శీతలీకరణ ప్రభావాన్నిస్తుంది. కాబట్టి, ఎండల్లో పెరుగుని ఆస్వాదించాలంటే నీటిలో కలి మజ్జిగలా తీసుకోవచ్చు. చాలా మంది వంటలు చేసేటప్పుడు పెరుగుని వేడి చేస్తుంటారు. కానీ, అలా అస్సలు చేయొద్దని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే, దీని వల్ల అందులోని గొప్ప గుణాలు తగ్గిపోతాయి. కఫ దోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, బరువు ఉన్నవారు తగ్గించి తినాలి.
Related News
Vastu Tips: వామ్మో.. అపరాజిత పుష్పాలతో అన్ని రకాల ప్రయోజనాల.. సంపద, శ్రేయస్సుతో పాటు..?
హిందూమతంలో పూల మొక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల పూల మొక్కలు, కొన్ని పూలు విశేషమైన గొప్ప లక్షణాలను కలిగి ఉంటాయి.