Sun Benefits: కొద్దిసేపు ఎండలో నిల్చోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
మామూలుగా ఉదయాన్నే కొద్దిసేపు సూర్యరశ్మిలో ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుందని అందుకే కొద్దిసేపు ఎండలో ఉండడం మంచిది అని వై
- By Nakshatra Published Date - 10:00 PM, Mon - 1 January 24
మామూలుగా ఉదయాన్నే కొద్దిసేపు సూర్యరశ్మిలో ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుందని అందుకే కొద్దిసేపు ఎండలో ఉండడం మంచిది అని వైద్యులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా శీతాకాలం సమయంలో చాలామంది చలి కారణంగా బయటికి రావడానికి ఇష్టపడరు. కాని చలికాలంలో ఎండ చలి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మరి శీతాకాలంలో కాసేపు ఎండలో కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే… వింటర్ సీజన్లో ఎండలో కూర్చోవడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.
సూర్యరశ్మి నైట్రిక ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది అధిక రక్త పోటను తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగకపోవడమే చాలా మంచిది. ఉదయం లేదా సాయంత్రం ఎండలో కూర్చోవడం వల్ల ఉల్లాసంగా ఉంటుంది. సూర్య రశ్మి న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ చేస్తుంది. దీని వల్ల సంతోషంగా ఉంచగలికే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. శీతా కాలంలో ప్రతిరోజు ఎండలో కాసేపు కూర్చోవడం వల్ల శరీరానికి విటమిన్ డి అనేది బాగా అందుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా విటమిన్ చాలా అవసరం. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
అలాగే మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు విటమిన్ డి చాలా అవసరం. శరీరానికి కావాల్సినంత విటమిన్ డి అందడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా రోగ నిరోధక శక్తి కూడా అందుతుంది. దీని వల్ల ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. కాసేపు ఎండలో ఉండటం వల్ల ఒత్తిడి వంటివి కూడా దూరమవుతాయి. అంతే కాకుండా మీ శరీరం అంతర్గత గడియారం నియంత్రనలో ఉంటుంది. ఇది మీరు రాత్రిళ్లు సరిగ్గా పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. చలికాలంలో బద్ధకంగా ఉంటుంది. ఏ పని చేయాలని అనిపించదు. ఎక్కువగా పడుకోవాలని అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ప్రతి రోజూ సూర్య రశ్మిలో ఉండటం వల్ల మీ ఎనర్టీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. దీంతో అలసట అనే భావన తగ్గుతుంది.