HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Why We Should Not Visit Temple In Afternoon

Temple: మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్ళకూడదు మీకు తెలుసా?

చాలామంది ప్రతిరోజూ కూడా ఆ దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. కొందరు పండగ రోజుల్లో విశేషమైన రోజుల్లో మాత్రమే దేవాలయాలకు వెళుతూ ఉం

  • Author : Anshu Date : 26-03-2024 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Temple
Temple

చాలామంది ప్రతిరోజూ కూడా ఆ దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. కొందరు పండగ రోజుల్లో విశేషమైన రోజుల్లో మాత్రమే దేవాలయాలకు వెళుతూ ఉంటారు. అయితే దేవాలయానికి ఎక్కువ శాతం ఉదయం లేదంటే సాయంత్రం సమయంలో ఎక్కువగా వెళుతూ ఉంటారు. మధ్యాహ్నం సమయంలో చాలామంది వెళ్లరు. అంతే కాకుండా మధ్యాహ్నం సమయంలో చాలా వరకు దేవాలయాలు మూసివేసి ఉంటాయి. కాగా ఎట్టి పరిస్థితిలో మధ్యాహ్నం పూట గుడికి వెళ్లకూడదని పండితులు చెబుతూ ఉంటారు.

కానీ దీని వెనుక ఉన్న కారణం ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. మరి మధ్యాహ్న సమయంలో గుడికి ఎందుకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధ్యాహ్నం గుడికి వెళ్లడం నిషిద్ధం వెనుక మూడు బలమైన కారణాలు ఉన్నాయట. అందులో మొదటి కారణం.. మధ్యాహ్నం మన శరీరం సోమరిగా ఉంటుంది. మన మెదడు నిద్రమత్తులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మధ్యాహ్నం సోమరితనం నిండిన మనస్సుతో దేవుడిని చూడకూడదని అంటారు. రెండో కారణం మధ్యాహ్నం స్వామికి నిద్రించే సమయం. కాబట్టి చాలా దేవాలయాల తలుపులు మధ్యాహ్నానికి మూసివేయబడతాయి. మధ్యాహ్న పూట స్వామివారు గుడిలో సేదతీరుతారు.

ఇలాంటి సమయంలో మీరు గుడికి వెళితే దేవుని నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఉదయం, సాయంత్రం పూటే ఆలయాన్ని సందర్శించేవాళ్లు మానవులు, పవిత్ర జీవులు. మధ్యాహ్నం దెయ్యాలు, పూర్వీకులు, తీరని ఆత్మల కాలమని నమ్ముతారు. ఇలాంటి సమయంలో స్వామి దర్శనం కోసం ఆలయంలో కనిపించని శక్తులు ఉంటాయి. వీళ్లకు బాధల నుంచి విముక్తి, మోక్షం లభిస్తుంది. మధ్యాహ్నం పూట గుడికి వెళ్లినప్పుడు మన కంటికి కనిపించని శక్తులకు, భగవంతుడికి మధ్య జరిగే సమావేశానికి ఆటంకం ఏర్పడుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే మధ్యాహ్నం దేవాలయాలు తెరిచే ఉన్నప్పటికీ భక్తులు వెళ్లకూడదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • afternoon
  • temple
  • temple visit

Related News

    Latest News

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • వెల్లుల్లి నీరు క్యాన్సర్‌ను నివారిస్తుందా?!

    • దేశ రక్షణలో భాగం కాబోతున్న పూడూరు సర్పంచ్

    • విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

    • టీమిండియాకు ఎంపిక కాక‌పోవ‌టంపై ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd