Spiritual: సొంతింటి కల నెరవేరాలా.. ఇంద్రకీలాది మెట్లపై ఇలా చేయాల్సిందే!
సొంత ఇంటి కల నెరవేరాలి అనుకున్న వారు విజయవాడకు వెళ్లి కొన్ని పూజలు చేయాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:30 AM, Fri - 20 September 24

ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇంటి కల అన్నది తప్పనిసరిగా ఉంటుంది. చాలామందికి ఈ కోరిక కోరికగానే మిగిలిపోతూ ఉంటుంది. అయితే ఈ సొంతింటి కలను నెరవేర్చుకోడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. రకరకాల పూజలు పరిహారాలు నోములు, వ్రతాలు దానధర్మాలు వంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు. అయితే మీకు కూడా సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటే ఇప్పుడు చెప్పినట్టుగా చేయాల్సిందే అంటున్నారు పండితులు. అందుకోసం అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ గుడిని దర్శించాల్సిందే అంటున్నారు.
కాగా కనకదుర్గమ్మ అమ్మవారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తుల కోరికలను తీర్చే ఈ తల్లి ఆలయం విజయవాడ నగరంలోని కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నారు. ఈ గుడికి పెద్ద చరిత్ర ఉంది కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన అమ్మవారిని తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని ప్రత్యేకంగా రాక్షసి సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చింది. పర్వతంగా మారి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.అయితే అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు అక్కడికి తరచూ రావడం వలన వేలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది. ఈ ఆలయానికి హిందూ పురాణాలలో ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది.
ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడు కొరకు తపస్సు చేసి శివుడు నుండి పాశుపతాస్త్రం పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా వెలసింది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ ఆలయానికి వచ్చి అమ్మని దర్శనం చేసుకుంటారు. విశేషమైన రోజుల్లో మాత్రమే కాకుండా ముఖ్యంగా దసరా నవరాత్రులలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు.
చండీయాగం జరిగే సమయంలో కూడా నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూనే ఉంటారు. ఇకపోతే ఈ దేవాలయానికి వచ్చేవారు దేవాలయం మెట్ల మీద రాళ్లు పెడితే సొంతింటి కల నెరవేరుతుందని భక్తులలో విశ్వాసం ఉంది. అలాగే జ్యోతిర్లింగ రూపంలో శివుడు ఇక్కడ వెలిశాడు. స్వామిని బ్రహ్మదేవుడు మళ్లీ కదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారిని మల్లికార్జునుడు అంటారు. కాబట్టి సొంత ఇంటి కల నెరవేరాలి అనుకున్న వారు ఇంద్రకీలాద్రికి వెళ్లి ఈ పని చేస్తే తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుందట.