Tulasi: తులసిని ఆ రెండు రోజులు అస్సలు తాకరాదు.. అవేంటంటే?
భారతదేశంలో హిందువులు తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. క్రమం
- By Nakshatra Published Date - 06:00 AM, Mon - 27 February 23
భారతదేశంలో హిందువులు తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. క్రమం తప్పకుండా తులసి మొక్కను పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని విశ్వసిస్తూ ఉంటారు. తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. తులసి ఆకులను కేవలం పూజలో మాత్రమే కాకుండా ఎన్నో ఔషదాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేద వైద్యంలోనూ తులసిని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి మొక్కలో లక్ష్మిదేవి, విష్ణువు ఇద్దరు కొలువై ఉంటారు.
కాబట్టి తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీ విష్ణు అనుగ్రహంతో పాటు తులసి దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అయితే తులసి మొక్కను పూజించడం మంచిదే అయినప్పటికీ తులసి మొక్క విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు కాబట్టి కొన్ని కొన్ని సమయాలలో నీళ్లు పోయక కూడదు అలాగే కొన్ని సమయాలలో తులసి మొక్కను తాకరాదు. అయితే తులసి ఆకులను కత్తిరించే సమయంలో ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రాల ప్రకారం తులసి మొక్కను రాత్రి లేదా సూర్యా స్తమయం సమయంలో ముట్టుకోకూడదు.
తులసి మొక్కని రాత్రి సమయంలో తాకడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి రాత్రుళ్లు అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత తులసికి నీరు పోయరాదు. ఇక ఆదివారం తులసి మొక్కను తాకకూడదు. ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఆ రోజున తులసి మాత ఉపవాసం ఉంటుందట. అలాగే ఇక ఏకాదశి నాడు కూడా తులసికి నీరు పెట్టకూడదు. ఏకాదశి రోజున తులసిదేవి విష్ణువు కోసం నిర్వా వ్రతాన్ని ఆచరిస్తుంది. కాబట్టి ఆ సమయంలో తులసి మొక్కకు నీరు సమర్పించడం వల్ల ఆమె ఉపవాసానికి భంగం కలిగించినట్టు అవుతుంది. దాంతో తులసి మొక్కకు కోపం వస్తుంది.
Tags
Related News
Raashi Khanna: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన రాశి ఖన్నా.. ప్రత్యేకమైన పూజలు?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగశౌర్య, రామ్ పోతినేని,రవితేజ గోపీచంద