Guru Vakri 2022: తిరోగమనంలో “గురుడు”.. 3 రాశులవారిపై ధన వర్షమే!!
ఈ పరిణామం వల్ల 3 రాశులకు చెందిన వాళ్ళపై వచ్చే 4 నెలల్లోగా ధన వర్షం కురవబోతోంది!!
- By Hashtag U Published Date - 10:30 AM, Sat - 30 July 22
ఒక గ్రహం గతి మారబోతోంది..
ఈ పరిణామం వల్ల 3 రాశులకు చెందిన వాళ్ళపై వచ్చే 4 నెలల్లోగా ధన వర్షం కురవబోతోంది!! ఇంతకీ ఆ గ్రహం ఏమిటి ? ఆ రాశి ఏమిటి ? అనేది తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే!!
పైన చెప్పిన వివరాలన్నీ దేవగురువు బృహస్పతికి చెందినవి. నవ గ్రహాల్లో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంటుంది. గురు గ్రహము తనకున్న బలం వల్ల విద్యా, ఉపాధి అవకాశాలకు అధిపతి. ఆయన అనుగ్రహం లేనిదే ఏ పనినీ చేయలేము. కుమారుడు, జీవిత భాగస్వామి, సంపద, విద్య, కీర్తి కారకుడిగా జ్యోతిష్య శాస్త్రంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది.
జూలై 29వ తేదీ .. అంటే ఈ రోజు నుంచి మరో 4 నెలల పాటు (నవంబరు 24 వరకు)
బృహస్పతి వక్రంలోకి వస్తాడు. వక్రంలోకి వెళ్లడం అంటే.. ముందుకు కాకుండా వెనక్కి పయనం సాగించడం!! ఒక్క మాటలో చెప్పాలంటే.. తిరోగమన బాటలో బృహస్పతి గ్రహం ఉంటుంది. ఈ తిరోగమనం వల్ల 3 రాశుల వారికి కొన్నేళ్ళుగా ఎదురవుతున్న కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. వారిపై ధన వర్షం కురిసే అవకాశాలు ఉంటాయి.
వృషభం : బృహస్పతి తిరోగమనం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు లాభపడతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది.
మిథునం : తిరోగమన గురువు మిథునరాశి వారికి అనేక ప్రయోజనాలను ఇస్తాడు. ఉద్యోగంలో మార్పు, పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం విస్తరించబడుతుంది. ఈ సమయంలో మార్కెటింగ్ లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి బృహస్పతి యొక్క రివర్స్ కదలిక అదృష్టమని చెప్పాలి. వీరికి అదృష్టం తోడై ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన ధనం మీకు అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
Related News
Cancer Cases In India: భారత్లో క్యాన్సర్ కేసులు పెరగటానికి కారణలేంటి..?
భారతదేశం ఇప్పుడు 'ప్రపంచానికి క్యాన్సర్ రాజధాని'గా మారుతోంది.