2025 Prophecies: 2025లో బాబా వంగా చెప్పినట్టే అన్నీ.. ఫ్యూచర్లోనూ అవన్నీ
2033లో ప్రపంచంలోని ధ్రువప్రాంతాల్లో(2025 Prophecies) మంచు కరుగుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి.
- By Pasha Published Date - 10:03 PM, Wed - 2 April 25

2025 Prophecies: 2025 సంవత్సరంలో జరగబోయే చాలా అంశాలపై వందేళ్ల క్రితమే బాబా వంగా జోస్యం చెప్పారు. ఆమె చెప్పిన విధంగానే ఈ ఏడాదిలో ఇప్పటివరకు పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంతకీ అవేమిటి ? రాబోయే కాలంలో జరుగుతాయని బాబా వంగా చెప్పిన ఇంకా ఇతర ఘటనలు ఏమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Eyebrows Vs Personality: కనుబొమ్మల్లోనూ పెద్ద సందేశం.. వ్యక్తిత్వాన్ని గుర్తించడం ఇలా..
2025 గురించి బాబా వంగా జోస్యం
- 2025 సంవత్సరంలో ఐరోపా ఖండంలో ఒక పెద్ద వివాదం ఏర్పడుతుంది. దీనివల్ల మొత్తం ఖండంలోని జనాభాపై తీవ్ర ప్రభావం పడుతుందని బాబా వంగా చెప్పారు. ఆమె చెప్పిన విధంగానే ఐరోపా ప్రాంతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపంలో పెద్ద వివాదం రాచుకుంది. ఈ యుద్ధం గత రెండున్నర ఏళ్లుగా కొనసాగుతోంది. ఒకవేళ ఈ యుద్ధం మరింత విస్తరిస్తే, ప్రాణ నష్టం పెరగొచ్చు. అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఉక్రెయిన్కు ఆయుధాలు అందడం కంటిన్యూ అయితే.. రష్యా సైతం దాడులను తీవ్రతరం చేస్తుంది. చివరకు ఉక్రెయిన్పైకి అణుబాంబు ప్రయోగం కూడా జరగొచ్చనే భయాలు అలుముకున్నాయి.
- 2025 సంవత్సరంలో భూకంపాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతాయని బాబా వంగా చెప్పారు. ఆమె చెప్పిన విధంగానే మయన్మార్లో భారీ భూకంపం వచ్చింది. వేలాది ప్రాణాలను బలిగొంది. భారీ మేడలు పేకల్లా కూలాయి.
- బ్రిటన్ యువరాణి డయానా మరణం సంభవించే తీరుపై బాబా వంగా ముందే జోస్యం చెప్పారు.
- 2001లో అమెరికాలోని న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేతపై బాబా వంగా జోస్యం చెప్పారు.
- చైనా ఎదుగుదల గురించి కూడా వంద ఏళ్ల క్రితమే ఆమె కచ్చితమైన అంచనా వేశారు.
Also Read :New Ministers List: కొత్త మంత్రుల లిస్టుపై రాహుల్ అభ్యంతరం.. వాట్స్ నెక్ట్స్ ?
బాబా వంగా ప్రకారం మానవాళి పతనం కాలక్రమంలో ఇలా..
- 2028లో మనుషులు ప్రత్యామ్నాయ శక్తి వనరు కోసం శుక్ర గ్రహంపై అన్వేషణ మొదలుపెడతారు.
- 2033లో ప్రపంచంలోని ధ్రువప్రాంతాల్లో(2025 Prophecies) మంచు కరుగుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి.
- 2130 నాటికి మనుషులు, గ్రహాంతర వాసులతో సంబంధాన్ని ఏర్పర్చుకుంటారు.
- 2170 నాటికి భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల్లోకి కరవు విస్తరిస్తుంది.
- 3005 నాటికి భూమిపై ఉన్న ప్రజలు, అంగారక గ్రహంపై నివసించే ప్రజలతో యుద్ధం చేస్తారు.
- 3797 నాటికి భూమి నివాసయోగ్యంగా ఉండదు. దీంతో మనుషులు దీన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది.
- 5079 నాటికి ప్రపంచం అంతం అవుతుంది.