Maredu Dalam: మారేడుదళంతోనే శివుడిని ఎందుకు పూజిస్తారు ?
శివారాధన అనగానే ముందుగా గుర్తొచ్చేది మారేడు దళం. ‘త్రిదళం.. త్రిగుణాకారం.. త్రినేత్రం చ త్రియాయుధం.. త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం.. శివార్పణం!!’ అనటాన్ని బట్టి మారేడుకు
- By News Desk Published Date - 06:00 AM, Wed - 29 November 23
Maredu Dalam: కార్తీకమాసం వచ్చిందంటే.. ఆ మాసమంతా శివనామాన్నే స్మరిస్తూ.. శివయ్యనే పూజిస్తూ తరిస్తారు భక్తులు. ముఖ్యంగా మారేడు దళంతో శివుడిని పూజించినా.. మారేడు దళాలతో అభిషేకం చేసినా.. మనసులో కోరికలు, కష్టాలు తీరుతాయని నమ్ముతారు. శివయ్యను మారేడుదళంతోనే ఎందుకు పూజిస్తారు ? అంటే.. దేవతా వృక్షాల జాబితాలో ముందుండే ఈ చెట్టును లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిందని పురాణ కథనం. అందుకే మారేడు కాయను శ్రీఫలం అంటారు.
లక్ష్మీదేవి కొలువై ఉండే 5 స్థానాల్లో మారేడుదళం ఒకటి. మనకు మూడు దళాల మారేడు కనిపిస్తుంది. అరుణాచలంలో మాత్రం 9 దళాలుండే మారేడు చెట్లు కనిపిస్తాయి. మారేడు అనే పేరులోనే చాలా గొప్పతనం ఉంది. మా-రేడు అంటే.. మా పాలకురాలు అని అర్థం. అన్నీ ఇవ్వగల శక్తి ఉన్న వృక్షమని అర్థం. ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే.. పువ్వులు పూయకూండానే కాయలు కాస్తుంది.
సాధారణంగా దేవుడిని పూజించేటపుడు పువ్వులకున్న తొడిమలను తీసి చేస్తాం. కానీ.. మారేడు దళ కాడను తీయకుండా ఈనెతోనే శివలింగంపై వేసి పూజిస్తారు. లింగానికి మారేడు దళపు ఈనె తగిలితే ఐశ్వర్యం సిద్ధిస్తుందని, బోర్లా పడితే జ్ఞానం కలుగుతుందని చెబుతారు.
త్రిదళం.. త్రిగుణాకారం.. త్రినేత్రం చ త్రియాయుధం.. త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం.. అనేదానిని బట్టే మారేడుకు ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. శివరాత్రినాడు కొందరు తెలియకుండా శివలింగంపైకి మారేడు దళాన్ని విసిరేసినంతనే.. శివకృపకు పాత్రులయ్యారని శివపురాణం చెబుతోంది.
శివారాధన అనగానే ముందుగా గుర్తొచ్చేది మారేడు దళం. ‘త్రిదళం.. త్రిగుణాకారం.. త్రినేత్రం చ త్రియాయుధం.. త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం.. శివార్పణం!!’ అనటాన్ని బట్టి మారేడుకు ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. శివరాత్రి నాడు తెలియకుండానే ఓ మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరేసినందుకే పలువురు శివుని కృపకు పాత్రులయ్యారని శివపురాణం చెబుతోంది. తనను మారేడుదళంతో పూజించిన వారిని చూసి శివుడు.. త్రియాయుషం అని దీవిస్తాడట. అంటే బాల్యం, యవ్వనం, కౌమారం అనే మూడు దశలను చూస్తావు అని అర్థం.
వినాయకచవితినాడు విఘ్నేశ్వరుడి పూజలో వాడే పత్రిలో కూడా బిల్వపత్రాలుంటాయి. తులసి, బిల్వ, నిర్గుండీ(వావిలి), అపామార్గ (ఉత్తరేణి), కపిత్థక(వెలగ), శమీ (జమ్మి), ఆమలక (ఉసిరిక), దూర్వా (గరిక) పత్రాలను అష్టబిల్వాలుగా చెబుతారు. మారేడుచెట్టు మొదటిిలో వరుసగా దీపారాధన చేసినవారికి తత్వజ్ఞానం లభిస్తుందట. మారేడుచెట్టుకింద ఒకరికి అన్నదానం చేసినా.. కోటిమందికి ఒకేసారి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మిక.