Chaitra Navratri 2022 Date : ఛైత్ర నవరాత్రుల్లో దుర్గాదేవి ఏ వాహనంపై వస్తుందో తెలుసా..?
హిందూ పంచాంగం ప్రకారం, చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉంది.
- By Hashtag U Published Date - 12:17 PM, Fri - 11 March 22
హిందూ పంచాంగం ప్రకారం, చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉంది. ఈ సమయంలో దుర్గాదేవిని తొమ్మిదిరోజుల పాటు…తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఈ నవరాత్రులు ఉత్తరభారతదేశంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎందరో ప్రముఖులు ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజిస్తారు. చైత్రనవరాత్రులను వసంత నవరాత్రి అని కూడా పిలుస్తారు. ఈ ఛైత్ర నవరాత్రులు ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభం అవుతాయి.
శ్రీరాముడు జన్మించిన ఛైత్ర శుద్ద నవమి వరకు కొనసాగనున్నాయి. అందుకే నవమిరోజు శ్రీరామ నవమి జయంతిని జరుపుకుంటారు. 2022లో ఛైత్ర నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి. శుభముహుర్తం ఎప్పుడుంది. ఈ ఏడాది దుర్గాదేవి ఏ వాహనం మీద ఊరేగనున్నారు. పూజా పద్దతులు ఏంటి. కలశ స్థాపన నియమాల గురించి తెలుసుకుందాం.
ఛైత్ర నవరాత్రులు ఎప్పుడు?
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా ఛైత్ర మాసంలోని శుక్లపక్షం పాడ్యమి రోజు నుంచి ఛైత్ర నవరాత్రులు ప్రారంభం అవుతాయి 2022లో ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం అవుతున్నాయి. 11 వ తేదీ వరకు ఈ నవరాత్రులు కొనసాగనున్నాయి. ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహిస్తారు. నవరాత్రుల్లో తొలిరోజున కలశ స్థాపనకు ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజుల్లో అమ్మవారు వచ్చే ప్రత్యేక వాహనాలకు కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది.
ఈ ఏడాది దుర్గాదేవి గుర్రం రథంపై స్వారీ చేస్తూ వస్తుందట. సాధారణంగా నవరాత్రులు అదివారం లేదా సోమవారం ప్రారంభం అయినట్లయితే…దుర్గా మాత ఏనుగుపై వస్తుందట. నవరాత్రులు మంగళవారం లేదా శనివారం ప్రారంభం అయినట్లయితే…గుర్రంపై స్వారీ చేస్తుందట. గురువారం లేదా శుక్రవారం అయితే అమ్మవారు పల్లకిలో విహరిస్తారు. ఈ సారి ఛైత్ర నవరాత్రులు శనివారం రోజున ప్రారంభం కావడంతో అమ్మవారు గుర్రంపై విహరించనున్నారు.
కలశ స్థాపన ముహుర్తం
చైత్ర నవరాత్రుల్లో భాగంగా తొలిరోజున కలశస్థాపన చేస్తారు. ఆ తర్వాత ప్రతిరోజూ తొమ్మిది రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు. కలశస్థాపనను కళాశాల అని పిలుస్తారు. ఈ సారి ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 6.10గంటల నుంచి 8.29గంటల వరకు శుభసమయం. ఈ శుభ ముహుర్తం మొత్తం 2గంటల 18 నిమిషాల వ్యవధి ఉంటుంది.
కలశ స్థాపన నియమాలు
ఈ నవరాత్రుల వేళ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి…శుభ్రమైన బట్టలు ధరించాలి. తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించండి. మట్టి కుండను తీసుకుని దానిపై మట్టిని వేసి…తర్వాత ధాన్యం గింజలను విస్తరించి…రెండో పొర మట్టిని వేసి…దానిని అమర్చేందుకు కొంచెం నీరు చల్లండి. పాత్రపై పవిత్రమైన దారాన్ని కట్టి పవిత్ర జలంతో నింపాలి. నాణేలను నీటిలో ఉంచాలి. గిన్నె అంచున 5 అశోక లేదా మామిడి ఆకులను వేసి మూతతో కప్పాలి. ఎరుపు రంగు గుడ్డను కొబ్బరికాయతో చుట్టి తీగతో కట్టి స్కిల్లెట్ పై ఉంచాలి. కలశం ఇప్పుడు దుర్గా దేవిని పిలవడానికి సిద్ధంగా ఉంది. దుర్గాదేవిని ఆహ్వానించి…ప్రార్థనను స్వీకరించండి. తొమ్మిది రోజులు కలశలో నివసించుమని దుర్గాదేవిని అభ్యర్థించండి.
తొమ్మిది రూపాలు…
తొలిరోజు- శైలపుత్రి
రెండో రోజు-బ్రహ్మచారిణి
మూడోరోజు -చంద్రఘంట
నాలుగురోజు-కుష్మాండ
ఐదో రోజు-స్కందమాత
ఆరో రోజు -కాత్యాయని
ఏడో రోజు-కాళీ మాత
ఎనిమిదో రోజు -మహాగౌరి
తొమ్మిదో రోజు-సిద్దిదాత్రి
ఇలా తొమ్మిది రోజులపాటు అమ్మవారిస స్తోత్రాలు, కథలతో దేవీమయంగా దీక్షను చేయాలి. నవరాత్రి వేళ ఎర్రనిపువ్వులు, ఎర్రని గంధం, ఎర్ర రంగులో ఉండే అక్షింతలు, ఎర్రని వస్త్రాలు అమ్మవారికి సమర్పించాలి. ఎర్రని కుంకుమతో అమ్మవారిని పూజిస్తే మంచిది.
Related News
Kanaka Durga Temple : విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశం.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..
నేడు దుర్గగుడి పాలకమండలి సమావేశం నిర్వహించారు. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు ఆధ్వర్యంలో సమావేశం జరగగా పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు.