Problems: కష్టాలు వెంటాడుతున్నాయా.. అయితే వెంటనే ఇలా చేయాల్సిందే?
మాములుగా చాలామంది ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కష్టాలు వెంటాడుతున్నాయని చెబుతూ ఉంటారు. అందుకు గల కారణం మీరు
- By Nakshatra Published Date - 05:10 PM, Tue - 16 May 23
మాములుగా చాలామంది ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కష్టాలు వెంటాడుతున్నాయని చెబుతూ ఉంటారు. అందుకు గల కారణం మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆర్థిక సమస్యలు వెంటాడడానికి అలాగే కష్టాలు రావడానికి కూడా కారణం అవుతాయి. అయితే కష్టాలు పడకుండా ఉండాలి అంటే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలి అన్న కొన్ని రకాల విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పొద్దున్నే నిద్ర లేవగానే తల్లిదండ్రులు, గురువు, ఇతర పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి.
ఈ అలవాటు వల్ల పెద్దల ఆశీర్వాదం లభించడమే కాదు. ఒక పాజిటివ్ నెస్ తో రోజు మొదలైనట్టు ఉంటుంది. అలాగే ఆవుకు బెల్లం, రొట్టే పెట్టాలి. వీలైతే రోజూ ఆవును పూజించాలి. అలా పూజిస్తూ ఈ రోజుకు ఈ ఆవు నాకు కామధేనువు. నేను కోరుకున్నవి అన్నీ నాకు ఇస్తుందని అనుకుంటూ ప్రార్థించాలి. అలాగే కుక్కలకు ఆహారం ఇవ్వడం, పక్షులకు గింజలు వెయ్యడం వల్ల కూడా మంచి జరుగుతుంది. మీ పరిసరాల్లో చెరువు, నది, లేదా సముద్రం ఉంటే గోధుమ పిండితో ఉండలు చేసి చేపలకు ఆహారంగా ఆ నీటిలో వేయాలి. అలాగే ప్రతి రోజు కాకులు, గద్దలు, పక్షుల కోసం మనం తినే ఆహారంలో కొంత తీసి పెట్టాలి. ఇంటికి వచ్చిన అతిథుల నుంచి ఏమీ ఆశించకుండా అతిథి సత్కారాలు చెయ్యాలి.
ఇంట్లో వండిన ఆహరం వడ్డించడానికి ముందు అందులోని మొదటి ముద్దను నెతితో ఆగ్నికి ఆహుతి ఇవ్వాలి. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో వాస్తు పురుషుడికి నైవేద్యం పెట్టినట్టు అవుతుంది. అంతేకాదు అన్నపూర్ణ కూడా తృప్తి చెందుతుంది. ఉదయాన్నే స్నానం చేసి శివలింగానికి నీళ్లు పోసి 108 సార్లు ఓం నమః శివాయ మంత్రం జపించి సాష్టాంగ నమస్కారం చేయాలి. అలాగే పొద్దున్నే స్నానం తర్వాత సూర్య భగవానుడికి ఎర్రని పూలను సమర్పించి చేతులెత్తి నమస్కరించాలి. ప్రతి శనివారం రావి చెట్టుకు నీళ్లు పోసి, పచ్చి పాలు పోసి ఏడు ప్రదక్షిణలు చేసి సూర్యుడు, శంకరుడు, రావి చెట్టును ఆరాధించాలి. ఇంట్లో చేసిన భోజనంలోని మొదటి ముద్ద ఆవుకు, చివరి ముద్ద కుక్కకు పెట్టడం నియమంగా పెట్టుకోవాలి.
Related News
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు..! ఎప్పుడంటే..?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత 2024కి ఇంకా తేదీ నిర్ణయించబడలేదు.