Garuda Puranam: మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుందో మీకు తెలుసా?
భూమి ఉన్న ప్రతి జీవరాశి ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి మరణించాల్సిందే. కాకపోతే ఒకరు ముందు వెనకా పోతూ ఉంటారు. కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక జీవరా
- By Nakshatra Published Date - 07:42 PM, Tue - 4 July 23
భూమి ఉన్న ప్రతి జీవరాశి ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి మరణించాల్సిందే. కాకపోతే ఒకరు ముందు వెనకా పోతూ ఉంటారు. కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక జీవరాశి ఏదో ఒక రోజు మరణించాల్సిందే. ఈ లోకంలో జన్మించినవారు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం తప్పదని శాస్త్రాల్లో, గ్రంథాల్లో కూడా పేర్కొన్నారు. ఆత్మను ఎవరూ నాశనం చేయలేరని భగవద్గీతలో వివరించారు. ఆత్మ నాశనం లేనది, అమరమైనది. అగ్ని దానిని కాల్చలేదు, నీరు దానిని తడపలేదు, గాలి చలింప చేయలేదు. మరణించిన తర్వాత వారి ఆత్మకు ఏమి జరుగుతుంది అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి తలెత్తుతూ ఉంటుంది.
మరి ఈ విషయం గురించి గ్రంథాలలో ఏం తెలిపారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గరుడ పురాణంలో, శ్రీ మహా విష్ణువు తన వాహనం పక్షిరాజైన గరుత్మంతుడికి జనన, మరణాల గురించి పరిపూర్ణంగా విశదీకరించాడు. దీని ప్రకారం, మరణం తరువాత కర్మలను అనుసరించి ఆత్మ నరకంలో బాధలు అనుభవించాల్సి ఉంటుంది లేదా స్వర్గాన్ని పొందుతుంది. అయితే పోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్తాడా లేకపోతే నరకానికి వెళ్తాడా అన్నది జీవితంలో ఆ వ్యక్తి చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. గరుడ పురాణంలో మరణం తరువాత ఆత్మ తన పాప పుణ్యాల లెక్కలు చేసే వివిధ మార్గాల గుండా వెళుతుందట. దీని తరువాత మాత్రమే ఆత్మ తదుపరి ప్రయాణం నిర్ణయం జరుగుతుంది. మరణానికి కొద్దిసేపటి ముందు ఒక వ్యక్తి స్వరం ఆగిపోతుందని, శరీరంలోని అన్ని ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయని, జీవితంలోని చివరి క్షణంలో వ్యక్తికి దైవిక దర్శనం లభిస్తుందట.
అలా జరిగిన తరువాత మాత్రమే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. అప్పుడు యమధర్మరాజుకు చెందిన ఇద్దరు యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. జీవించి ఉన్నప్పుడు వ్యక్తి ఇతరులతో ప్రవర్తిస్తాడో ఈ ప్రయాణంలో మార్గ మధ్యలో యమదూతలు ఆత్మతో అదే విధంగా ప్రవర్తిస్తారు. గరుడ పురాణం చెప్పిన ప్రకారం మరణం తరువాత ఆత్మ మూడు మార్గాల గుండా వెళుతుందట. ఇందులో మొదటిది స్వర్గలోక మార్గం. రెండవది పితృలోక మార్గం. మూడవది నరకలోక మార్గం. ఇందులో మొదటి మార్గంలో జీవితంలో కేవలం పుణ్యకార్యాలే చేసి పాపాలకు దూరంగా ఉండే వారు వెళతారు. పితృలోక మార్గం ప్రయాణాన్ని పితృలోక ప్రయాణం అంటారు. మరోవైపు, మూడవ మార్గం మాత్రం చాలా విధ్వంసక మార్గం. ఇది నరకానికి ప్రయాణం, ఇందులో ఆత్మ చాలా బాధను ఎదుర్కోవలసి వస్తుంది. బతికి ఉన్నప్పుడు ఏయే పనులు చేసింటారో వాటి ఆధారంగా వారిని ఏ మార్గంలో పంపాలనేది నిర్ణయిస్తారు.
Related News
మరణం సమయంలో ఆ 4 వస్తువులు ఉంటే చాలు.. స్వర్గంలోకి ప్రవేశం?
గరుడ పురాణంలో మనిషి మరణం తర్వాత జరిగే ఎన్నో విషయాల గురించి తెలిపారు. మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది. మరణ సమయంలో ఒక వ్యక్తి ఎలాంటి