Marriage: వివాహం జరగడం లేదని బెంగపడుతున్నారా…అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!
పంచాంగం ప్రకారం, శనివారం చాలా పవిత్రమైన రోజు.
- By Hashtag U Published Date - 06:00 AM, Fri - 20 May 22
పంచాంగం ప్రకారం, శనివారం చాలా పవిత్రమైన రోజు. ఈ తేదీని విష్ణుమూర్తికి అంకితం చేశారు. ఈ రోజున విష్ణు అవతారాలకు చెందిన రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. విష్ణువును పూజించడానికి శనివారం కూడా ఉత్తమంగా పరిగణించబడుతుంది. అయితే ఈరోజు పూజలు, పరిహారాలు చేయడం వల్ల వివాహ సమస్యలనుంచి యువతీ యువకులు అధిగమించవచ్చు.
చాలా సార్లు, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, వివాహంలో అడ్డంకులు, ఇబ్బందులు ఉంటాయి. కొన్నిసార్లు వివాహం ఆలస్యం కావడం కూడా మానసిక ఆందోళన ఒత్తిడికి కారణం అవుతుంది. వివాహంలో జాప్యం లేదా అడ్డంకులు ఏర్పడినట్లయితే, శనివారం, విష్ణువును పూజించాలి, ఈ రోజు ఉపవాసం ఉండటం కూడా మంచిది. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి , పసుపు పళ్లు, పూలను దేవునికి నైవేద్యంగా పెట్టాలి. పసుపు రంగులో ఉండే పదార్థాలను ఉపవాసం అనంతరం తినాలి. శనగపిండి లడ్డూలు, శనగపిండి రోటీలు తినడం ఉత్తమం. దీనితో పాటు, జ్యేష్ఠ మాసం కావునా జలదానం చేస్తే చాలా శ్రేయస్కరం.
సుందరకాండ పఠించండి
ప్రతీ శనివారం సుందర కాండ చదవడం, లేదా పారాయణం వినడం వల్ల వివాహంలో జాప్యాన్ని కూడా తొలగిస్తుంది. రామాయణంలోని సుందరకాండను క్రమం తప్పకుండా పారాయణం చేయడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. 21 శనివారాల పాటు నిరంతరం సుందరకాండ పఠించడం వల్ల అడ్డంకులు మరియు ఇతర సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సీతారాములతో కూడిన హనుమంతుని చిత్రపటం ముందు పారాయణం చేయాలి.
Related News
Lakshmi Devi: ప్రతీరోజు సాయంత్రం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు.. డబ్బే డబ్బు?
హిందువులు లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని సిరి సంపదలకు అధిదేవత అంటారు. లక్ష్మీ దేవి ఆశీస్సులు తనపై, తన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరకుంటూ ఉంటారు. అందుకే ప్రజలు వివిధ మార్గాల్లో పూజలు చేస్తూ లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి సాయంత్రం వేళ చే�