Goddess lakshmi : ఐశ్వర్య దీపంతో ఇంట్లో లక్ష్మీ దేవి తిష్ట వేయడం ఖాయం.. ఎలా పెట్టాలంటే..
కొంతమంది ఎంత సంపాదించినా...నిలువ ఉండదు. వచ్చిన సంపాదనా వచ్చినట్లుగానే ఖర్చు అవుతుంది. అప్పులు తీరవు...వడ్డీలు పెరుగుతుంటాయి.
- By hashtagu Published Date - 06:30 AM, Sat - 18 June 22
కొంతమంది ఎంత సంపాదించినా…నిలువ ఉండదు. వచ్చిన సంపాదనా వచ్చినట్లుగానే ఖర్చు అవుతుంది. అప్పులు తీరవు…వడ్డీలు పెరుగుతుంటాయి. వ్యాపారంలో లాభాలు లేకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి…వ్యాపారంలో పలు కారణాల వల్ల నష్టాలు వచ్చే వారికి…కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా…అసలు ఎలాంటి ఆదాయం లేని వారికి ..ఈ ఐశ్వర్య దీపం మంచి పరిహారామని జ్యోతిష్య్కులు చెబుతున్నారు. అసలు ఈ ఐశ్వర్యదీపం అంటే ఏమిటి?…దీన్ని ఉప్పుతోనే ఎందుకు పెడతారు?..ఎందుకు పెడతారు?…ఎలా పెడతారో తెలుసుకుందాం?
ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలగించాలి…?
ప్రతి శుక్రవారం ఉదయం కానీ…సాయంత్రం కానీ రెండు ప్రమిదలు తీసుకుని..పసుపు, కుంకుమతో బొట్లు పెట్టాలి. నేలపై బియ్యంపిండి పసుపు కుంకుమతో ముగ్గు వేయాలి. దానిపై ప్రమిధలను ఒకదానిపై ఒకటి పెట్టి అందులో పావుకిలో రాళ్ల ఉప్పు వేయాలి. ఆ ఉప్పు పైనా పసుపు, కుంకుమ చల్లాలి. చిన్న ప్రమిధలు ఒకదానిపై ఒకటి పెట్టి పుసుపు కుంకుమా పూలు పెట్టి నూనె కానీ…నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు వేసి వెలిగించాలి. తర్వాత దీపం శ్లోకాన్ని పఠించాలి.
పండ్లు కానీ, పాలు, పటికబెల్లి, కొబ్బరికాయా ఇలా ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రాన్ని చదవాలి. అంతేకాదు కనకధార స్త్రోత్రం చదవితే ఇంకా చాలా మంచిది.
శుక్రవారం ఇలా దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు ఆ ప్రమిధల్లోని ఉప్పు తీసి నీటిలో కలిపి ఇంటి బయట చెట్లకు కానీ..నదిలో కానీ కలపాలి. ప్రమిధలను మార్చాల్సిన అవసరం లేదు. వాటిని ప్రతివారం వాడుకోవచ్చు.
ఇలా ప్రతి శుక్రవారం ఉప్పుపైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పును మార్చేయాలి. ఇలా 11 శుక్రవారాలు కానీ 16 కానీ, 21కానీ, 41 శుక్రవారాలు చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ దీపాన్ని ఈశాన్యం మూలన పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది 41వ శుక్రవారం ఈ దీపాన్ని పెట్టేవారికి శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక కొంతమంది రాక్ సాల్ట్ పెడుతుంటారు…దానికంటే రాళ్ల ఉప్పు పెట్టడమే సంప్రదాయం.
Related News
Aishwarya Deepam: ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలు లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవాల్సిందే?
చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల పూజలు పరిహారాలు దానధర్మాలు చేస్తూ ఉంటారు. కొందరికి అమ్మవారి అనుగ్రహం తొందరగా గలిగే మరికొందరికి ఎన