Garuda Puranam : ఆది, సోమ, శుక్రవారాలు ఈ పనులకు మంచి రోజులు..మిగతా రోజుల్లో చేశారో..సమస్యలు తప్పవు..!!
గరుడ పురాణానికి హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ పురాణం పుట్టుక నుండి మరణం వరకు ఆత్మ ప్రయాణం గురించి వివరిస్తుంది.
- By hashtagu Published Date - 09:00 AM, Sun - 14 August 22
గరుడ పురాణానికి హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ పురాణం పుట్టుక నుండి మరణం వరకు ఆత్మ ప్రయాణం గురించి వివరిస్తుంది. ఇంట్లో ఎవరైనా చనిపోతే గరుడ పురాణం పఠించాలని చాలామంది నమ్ముతుంటారు. అలాగే అందులో పేర్కొన్న ఫార్మాలిటీస్ అన్నీ పాటించాలి. జననం, మరణం, ఆత్మ మొదలైన వాటితో పాటు, విజయవంతమైన , సంతోషకరమైన జీవితాన్ని నడిపించే పద్ధతులు కూడా గురుడ పురాణంలో చెప్పబడ్డాయి.
సరైన సమయంలో మంచి పనులు చేయాలని గరుడ పురాణం సూచించింది. లేకుంటే శుభకార్యాలు కూడా అశుభ ఫలితాలను ఇస్తాయి. దీని కారణంగా పేదరికం, రోగాలు మొదలైన వాటిని ఎదుర్కోవలసి వస్తుంది. ఏ శుభ సమయంలో ఏ శుభ కార్యాలు చేయాలి..? అశుభ సమయంలో ఏ శుభకార్యం చేస్తే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం.
1. ఈ సమయంలో తులసిని తాకడం అశుభం:
ఇంట్లో తులసి మొక్క, సంరక్షణ, నీరు సమర్పించడం, దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. కానీ కొన్ని తులసీని తాకడం కుటుంబానికి అశుభం. సాయంత్రం పూట తులసిని ముట్టుకోకూడదు లేదా నీరు పోయకూడదు. సాయంత్రం కేవలం తులసి కింద దీపం పెట్టి, వెలిగించిన వెంటనే దీపం తీసివేయాలి.
2. ఈ సమయంలో ఇంటిని తుడుచుకోవద్దు:
సూర్యాస్తమయం సమయంలో సూర్యాస్తమయం తర్వాత కూడా చీపురుతో ఇంటిని తుడుచుకోవద్దు. ఇలా చేయడం వల్ల తల్లి లక్ష్మికి కోపం వచ్చి ఇంట్లో దరిద్రం వస్తుంది. సాయంత్రం వేళలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. అలాంటి సమయాల్లో చీపురుతో ఇంటిని ఊడ్చకండి.
3. ఈ పనులు చేయవద్దు:
మంగళవారం, గురువారాలు, శనివారాల్లో జుట్టు, గోర్లు కత్తిరించవద్దు. ఆది, సోమ, బుధ, శుక్రవారాలు ఈ పనులకు మంచి రోజులుగా పరిగణిస్తారు.
4. ఈ సమయంలో దానం చేయవద్దు:
సాయంత్రం అనగా సంధ్యా సమయంలో ఎవరికీ పాలు, పెరుగు, ఉప్పు, పులిసిన పిండిని దానం చేయవద్దు. ఇది ఇస్తే లక్ష్మీ దేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి సాయంత్రం పూట ఈ ఆహార పదార్థాలను దానం చేయకండి.
అశుభ సమయాల్లో పై పనులు చేస్తే అశుభం కలుగుతుందని గరుడ పురాణం చెబుతోంది. మీరు ఇప్పటి నుండి కూడా అశుభ సమయాల్లో ఈ పనులు చేయకుండా ఉండండి.
Related News
Garuda Purana: చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఆ మూడు వస్తువులను వాడుతున్నారా.. అయితే అంతే సంగతులు?
మామూలుగా చాలామంది వారికి ఇష్టమైన వారు చనిపోతే వారికి సంబంధించిన వస్తువులను వారి దగ్గర అలాగే పెట్టుకుంటూ ఉంటారు. వారి వస్తువులను జ్ఞాపకంగా,