Shruti Haasan : ఐ యామ్ నాట్ సింగిల్.. అతనితో రిలేషన్ షిప్ లో ఉన్నా!
బాయ్ఫ్రెండ్ శాంతను హజారికాతో తన రిలేషన్ షిప్ గురించి ఇటీవల శ్రుతి హాసన్ వెల్లడించింది. మందిరా బేడీ షో ‘ది లవ్ లాఫ్ లైవ్’ షోలో తామిద్దరం బలమైన బంధాన్ని పెంచుకున్నారని ఈ బ్యూటీ చెప్పింది.
- By Balu J Published Date - 01:03 PM, Sat - 20 November 21
బాయ్ఫ్రెండ్ శాంతను హజారికాతో తన రిలేషన్ షిప్ గురించి ఇటీవల శ్రుతి హాసన్ వెల్లడించింది. మందిరా బేడీ షో ‘ది లవ్ లాఫ్ లైవ్’ షోలో తామిద్దరం బలమైన బంధాన్ని పెంచుకున్నారని ఈ బ్యూటీ చెప్పింది. అయితే ‘మీ ఇద్దరి మధ్య లవ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది’ అని అడిగినప్పుడు.. శాంతాను తమ కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యారని, అయితే నిజంగా ఒకరినొకరు సరిగ్గా కలవలేదని శ్రుతి వెల్లడించింది. శృతి హాసన్, శాంతాను హజారికా ఆన్లైన్లో చాట్ చేయడం ప్రారంభించారని, గ్రాఫిక్ నవలలు వంటి చాలా కామన్ హ్యాబిట్స్ ఉన్నాయని చెప్పారు. అయితే ‘మీ రిలేషన్ గురించి ఎందుకు ఓపెన్ కావడం లేదు’ అని ప్రశ్నించగా “నేను గతంలో చాలాసార్లు సీక్రెట్ ఉంచాను. చాలా కాలంగా ఒంటరిగా ఉన్నట్ల ఫీల్ అయ్యాను. అయితే ఈ విషయం నా భాగస్వామికి అగౌరవంగా అనిపించిందని అన్నారు.
కేవలం ఇష్టపడితేనే సరిపోదు.. ఒకరి అభిరుచులు, అలవాట్లు తెలుసుకోవాలి. నా వరకు అయితే ఆర్థిక, మతపరమైన నిర్ణయాలు, జీవన విధానాలకు సంబంధించి ఎలాంటి తేడాలు లేవు. నా లైఫ్ పార్ట్ నర్ లో నేనే కోరుకున్న విషయాలన్నీ ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే మరుక్షణమే అది అందరికీ చెప్పేస్తానని, ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవని చెప్పింది శృతిహాసన్. శాంతనూ నా బెస్ట్ ఫ్రెండ్. తను ఒక ప్రతిభగల ఆర్టిస్ట్. సంగీతం, కళలు, సినిమాల విషయాలలో మా అభిప్రాయాలు చాలా బాగా కలిశాయి. తనతో కలిసి సమయం గడపడం నాకు చాలా ఇష్టం. తనంటే నాకు చాలా గౌరవం కూడా” అని చెప్పింది శృతి హాసన్.
తెలుగులో ‘క్రాక్’ వంటి పెద్ద హిట్ పడటం ఆమెకి బాగా కలిసొచ్చింది. ఆ తరువాత ఆమె ప్రభాస్ జోడీగా ‘సలార్’ అనే పాన్ ఇండియా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా చేస్తూనే ఆమె బాలకృష్ణ తదుపరి సినిమాకి ఓకే చెప్పింది. ఒక వైపున ప్రభాస్ సరసన చేస్తూ మరో వైపున బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ పక్కన ఆడిపాడటానికి ఆమె అంగీకరించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే శ్రుతి హాసన్ చాలా షరతులు పెట్టిందట. రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండకూడదు అనేది వాటిలో ఒకటి. అన్నిటికీ అంగీకరించే గోపీచంద్ మలినేని ఓకే అనేశాడట.
Related News
Tollywood: ‘సితార’ సినిమాకు 40 వసంతాలు.. తెలుగు చలన చిత్రాల్లో ఓ కల్ట్ క్లాసిక్!
Tollywood: పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన కళాత్మక కావ్యం సితార’. ఏప్రిల్ 27, 1984న విడుదలైన ఈ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకుంది. పూర్ణోదయా చిత్రాలైన ‘తాయారమ్మ-బంగారయ్య’, ‘శంకరాభరణం’, ’సీతాకోకచిలక’చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన వంశీలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద నాగేశ్వరరావు, వంశీకి ఈ అవకాశం ఇచ్చారు. వంశీ రచించిన ‘మహల్లో క�