Samantha: సమంత ‘శాకుంతలం’ ప్రమోషన్స్ షురూ.. లేటెస్ట్ లుక్స్ అదుర్స్!
సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం (Shaakuntalam) లాంటి ప్రతిష్టాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
- By Balu J Published Date - 05:31 PM, Wed - 15 March 23
టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha) మంచి నటి మాత్రమే కాదు.. మంచి ఫ్యాషన్ సెన్స్ ఉన్న హీరోయిన్ కూడా. శారీ అయినా, హాఫ్ శారీ అయినా, లెహంగా అయినా, స్విమ్ సూట్ అయినా తన మార్క్ ఉండేలా చూసుకుంటారు. చాలా సందర్భాల్లో సమంత ధరించిన దుస్తులు హైలైట్ అయ్యాయి. ఈతరం అమ్మాయిలను బాగా అట్రాక్ట్ చేశాయి కూడా. ఏదైనా పార్టీలు, పంక్షన్లకు వెళ్లాలనుకున్నా చాలామందికి సమంత వార్డ్ రోబ్ గుర్తుకువస్తుంది. సమంతలా డ్రస్ అప్ అయి మురిసిపోయిన సందర్భాలున్నాయి. తాజాగా సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం (Shaakuntalam) లాంటి ప్రతిష్టాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఆ సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్ లోనే సమంత అందంగా కనిపించి ఆకర్షించింది.
ఇప్పటికే శాకుంతలం మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన సామ్ బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. శాకుంతలం సినిమా యూనిట్ తో కలిసి ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు. పెద్దమ్మతల్లిని ఆ సినిమా యూనిట్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసింది. అయితే అందరి కళ్లు సమంత (Samantha) పై పడ్డాయి. ఆమె ధరించిన డ్రస్సు ఆకట్టుకుంది. హీరోయిన్ సమంతతో పాటు డైరెక్టర్ గుణశేఖర్, ప్రొడ్యూసర్ నీలిమ, దేవ్ మోహన్ లు కూడా ఉన్నారు. ఈ చిత్రంలో మలయాళీ హీరో దేవ్ మోహన్ కీలకపాత్రలో నటించారు.
ప్రకాశ్ రాజ్, అదితి బాలన్, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి తదితరులు కీలక పాత్రలలో నటించారు. అంతేకాదు.. ఈ సినిమాలో తొలిసారిగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా కనిపించిందని సమాచారం. శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో సమంత (Samantha) శాకుంతలం సినిమా యూనిట్ ప్రమోషన్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ మూవీని వాచ్ చేసిన సామ్ డైరెక్టర్ పై తన ప్రేమను చాటుకుంది.
Also Read: Balakrishna Warning: నేను చిటికేస్తే చాలు.. వైసీపీ ఎమ్మెల్యేకు బాలయ్య వార్నింగ్!
Related News
Tollywood: ‘సితార’ సినిమాకు 40 వసంతాలు.. తెలుగు చలన చిత్రాల్లో ఓ కల్ట్ క్లాసిక్!
Tollywood: పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన కళాత్మక కావ్యం సితార’. ఏప్రిల్ 27, 1984న విడుదలైన ఈ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకుంది. పూర్ణోదయా చిత్రాలైన ‘తాయారమ్మ-బంగారయ్య’, ‘శంకరాభరణం’, ’సీతాకోకచిలక’చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన వంశీలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద నాగేశ్వరరావు, వంశీకి ఈ అవకాశం ఇచ్చారు. వంశీ రచించిన ‘మహల్లో క�