Prathinidhi 2 : ఎన్నికల పోలింగ్ కు 2 రోజుల ముందు ప్రతినిధి 2 దింపుతున్న ‘మూర్తి’..
ఏప్రిల్ 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని అనుకున్నారు కానీ సరిగ్గా విడుదలకు రెండు రోజుల ముందు రిలీజ్ వాయిదా వేసి షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 10 న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు.
- By Sudheer Published Date - 07:54 PM, Sat - 4 May 24
ఏపీలో ఎన్నికల హోరు ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు.ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార – కూటమి పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తూ..ఒకరిపై ఒకరు విమర్శలు , ఆరోపణలు, సవాళ్లు విసురుకుంటూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో టీవీ 5 మూర్తి..ప్రతినిధి 2 థియేటర్స్ లోకి దింపబోతుంది.
We’re now on WhatsApp. Click to Join.
నారా రోహిత్ (Nara Rohit) నటిస్తున్న తాజా చిత్రం ప్రతినిధి 2 (Prathinidhi 2 ) . టీవీ-5 సీనియర్ జర్నలిస్ట్ మూర్తి (TV5 Murthy) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ మూవీ ని వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మించగా.. మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతం అందించాడు. సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్గుప్తా, సచిన్ ఖేదేహర్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా తాలూకా ట్రైలర్స్ , టీజర్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి నింపాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంత ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని అనుకున్నారు కానీ సరిగ్గా విడుదలకు రెండు రోజుల ముందు రిలీజ్ వాయిదా వేసి షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 10 న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. రాష్ట్రంలో పోలింగ్ కు రెండు రోజుల ముందు ప్రతినిధి 2 దింపబోతున్నారు. ఈ చిత్రం మొత్తం అధికార పార్టీ వైసీపీ కి వ్యతిరేకంగా ఉందని ఇప్పటికే చాలామంది అంటున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కు ముందు రిలీజ్ చేస్తుండడం తో ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Read Also : Sharmila : అద్దంలో చూసుకుంటే జగన్కు చంద్రబాబు ముఖమే కనబడుతోందా?: షర్మిల
Related News
Director Murthy : నీ చావు బ్రతుకులను దృవీకరించేది ప్రభుత్వం.. ఓటు వెయ్యకపోతే చచ్చిపో..
ప్రతినిధి 2 సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్ డైరెక్టర్ మూర్తి.. ఓటు వెయ్యకపోతే చచ్చిపో అంటున్నారు. ఎందుకంటే..