Political Thriller: ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ చిత్రాలు, పొలిటికల్ మైలేజ్ కోసం బిగ్ స్కెచ్!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి.
- By Balu J Published Date - 12:12 PM, Fri - 20 October 23
Political Thriller: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల సమయానికి తమ సినిమాలు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఎన్నికల సీజన్లో మూడు సినిమాలు విడుదల అయ్యేందుకు రెడీగా ఉన్నారు. నవంబర్లో విడుదల కానున్న సినిమాలు ప్రజలను అలరించడమే కాకుండా, చర్చలను ప్రేరేపించి, ఇతరులను ప్రభావితం చేసేలా ఉండబోతున్నాయి. ఈ మూడు సినిమాల్లో ఒకటి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జీవితం ఆధారంగా ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు. తన రాజకీయ ఎత్తుగడలను ఎలా ప్లాన్ చేసుకుంటాడో, అలాగే TDp అధినేత N. చంద్రబాబు నాయుడుని ఫెయిల్యూర్గా చిత్రీకరించే జీవిత చరిత్ర సినిమా ఇది.
మరో సినిమాని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ నిర్మిస్తున్నారు. “ఈ చిత్రం సనాతన ధర్మం, మతం, కరోనావైరస్, బిజెపి రాజకీయాలు వంటి ఇతివృత్తాల ఆధారంగా తెరకెక్కుతుంది” అని దయాకర్ అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండబోతుంది. కలిగి ఉంటుందని. ప్రజలలో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. నవంబర్ రెండో వారంలో విడుదల కానుంది.
తెలంగాణా బిజెపి నాయకుడు గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన మూడవ చిత్రం. రజాకార్ల దురాగతాలపై దృష్టి సారించి, వారితో పోరాడడంలో ప్రజల దృఢ సంకల్పాన్ని హైలైట్ చేస్తుంది. చారిత్రత్మక నేపథ్యంలో తెరకెక్కినప్పటికీ బీజేపీ మైలేజ్ కోసమే విడుదల అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఆర్జీవీ సినిమా చంద్రబాబు నాయుడుని విమర్శనాత్మకంగా చిత్రీకరించడం వల్ల జగన్ మోహన్ రెడ్డికి హెల్ప్ కావచ్చు అని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సినిమాపై స్పష్టత లేకపోయినప్పటికీ ఇప్పటికే కేసీఆర్ పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది.
Related News
Cm Revanth: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. త్వరలో మేడిగడ్డ, సుందిళ్ల పరిశీలన
Cm Revanth: కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎన్డీఎస్ఏ నివేదికపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రివర్గ సహచరులతో చర్చించారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగిపోవటం, సుందిళ్ల బ్యారేజీకి బుంగలు పడటం వంటి అంశాలను పరిశీలించిన #NDSA ఇటీ