Keeravani: ఆస్కార్ అవార్డు విన్నింగ్ పై కీరణావాణి షాకింగ్ కామెంట్స్.. అసలు అవార్డు తన వల్ల రాలేదంటూ?
ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు వాడి సత్తాను ప్రపంచానికి చాటింది. తెలుగు సినిమా కేవలం దక్షిణాదికి మాత్రమే పరిమితం కాదనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పింది. బాలీవుడ్ హవా కొనసాగుతున్న
- By Nakshatra Published Date - 10:24 PM, Sun - 9 April 23
Keeravani: ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు వాడి సత్తాను ప్రపంచానికి చాటింది. తెలుగు సినిమా కేవలం దక్షిణాదికి మాత్రమే పరిమితం కాదనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పింది. బాలీవుడ్ హవా కొనసాగుతున్న తరుణంలో భారత్ లో తెలుగు సినిమా కూడా ఉందని తెలియజెప్పింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ దక్కింది. ఆ మూవీ టీంను ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరించుకున్న క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరైనా ఏదైనా విజయం సాధిస్తే, అదంగా తన వల్లే వచ్చిందని చెప్పుకుంటారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మాత్రం అలా కాదు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. ఇది ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలుసు. ఇంకా ఆయన ఏ సినిమా పెద్ద హిట్ అయినా, ఆ మూవీలో మ్యూజిక్, పాటలు సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ అదంతా పక్కవాళ్లకే క్రెడిట్ ఇస్తారు. ఇప్పుడు కూడా నాటు నాటు పాటకు ఆస్కార్ రావటంలో ఆయన సినిమా డైరెక్టర్ కు, టీంకు క్రెడిట్ ఇచ్చారు.
సత్కార వేదికపై మాట్లాడిన కీరవాణి గుడిలో మూల విగ్రహాలు ఉంటాయి. వీటితోపాటు అలాగే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఈ అత్యున్నత పురస్కారం గెలవటంలో తాను చంద్రబోస్ కేవలం ఉత్సవ విగ్రహాలు మాత్రమే. మూల విగ్రహాలు ఎవరంటే రాజమౌళి, ప్రేమ్ రక్షిత్. ఇదే విషయాన్ని గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వేదికలపై కూడా చెప్పామన్నారు.
నా ఫస్ట్ సాంగ్ ప్రసాద్ 70 ఎంఎం థియేటర్లో రికార్డు చేయడం రసగుల్లా తినడం లాంటి అనుభూతి అయితే, ఆస్కార్ దాని తర్వాత టీ తాగడం వంటిది. అలా అని ఆస్కార్ ని తక్కువ చేయడం లేదు. ఆస్కార్ కంటే ఫస్ట్ సాంగ్ ప్రసాద్ 70 ఎంఎం థియేటర్లో రికార్డు చేయడం నాకు గొప్ప అనుభూతి పంచింది. ఆస్కార్ గెలిచినందుకు నాకు ఎగ్జైట్మెంట్ లేదు.
Related News
Rajamouli Mahesh : రాజమౌళి మహేష్.. 15 ఏళ్ల క్రితమే చేయాల్సిందా..?
Rajamouli Mahesh గుంటూరు కారం తర్వాత మహేష్, RRR తర్వాత రాజమౌళి ఈ ఇద్దరు కలిసి SSMB 29 సినిమా చేయబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ ఈ సినిమా