D51: క్రేజీ కాంబినేషన్.. ధనుష్-శేఖర్ కమ్ముల మూవీలో నేషనల్ క్రష్ రష్మిక!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతుండటంతో టాలీవుడ్ లో కొత్త కొత్త కాంబినేషన్స్ పుట్టుకువస్తున్నాయి.
- By Balu J Published Date - 04:51 PM, Mon - 14 August 23
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతుండటంతో టాలీవుడ్ లో కొత్త కొత్త కాంబినేషన్స్ పుట్టుకువస్తున్నాయి. ఇప్పటికే తెలుగు సినిమాల్లో బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్స్ తెలుగు సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. ధనుష్-శేఖర్ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా ఎంపికైంది. ఈ కన్నడ అమ్మాయికి తెలుగులోనే కాక కన్నడ, తమిళం, హిందీ.. ఇలా పలు భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇలాంటి క్రేజీ హీరోయిన్ ధనుష్ సినిమాలోకి వచ్చిందంటే హైప్ మరింత పెరగడం ఖాయం. ధనుష్కు ఆమె సరైన జోడీ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కమ్ములతో ‘లవ్ స్టోరీ’ తీసిన ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామా అని.. కమ్ముల ఇప్పటిదాకా తీసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. తొలిసారి యాక్షన్ టచ్ ఉన్న సినిమా తీస్తుండటంతో దీన్ని కమ్ముల ఎలా డీల్ చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ధనుష్ ఓకే చేశాడు అంటే ఈ కథ ప్రత్యేకంగా ఉంటుందనే భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదికి వెళ్లే అవకాశమున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కావచ్చు. వైవిధ్యమైన నటనలో ధనుష్, సహజత్వం కూడిన కథలను తెరకెక్కించడంతో శేఖర్ కమ్ముల, ఏ పాత్ర అయినా అవలీలగా నటించడంలో రష్మికల సొంతం. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీలో కింగ్ నాగార్జున గెస్ట్ రోల్ లో నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Also Read: Hardik Pandya: ఒక్క ఓటమితో వచ్చిన నష్టం ఏమీలేదు, కుర్రాళ్లు పాఠాలు నేర్చుకున్నారు: హార్థిక్ పాండ్యా
Related News
Ram Charan : రామ్ చరణ్ సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్ చేయబోతుందా..?
రామ్ చరణ్ సినిమాలో రష్మిక స్పెషల్ సాంగ్ చేయబోతుందా..? బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న RC16లో..