Actress Anasuya: వేశ్యా పాత్రకు అనసూయ సై!
ఇటీవల గోపీ చంద్ 'పక్కా కమర్షియల్' చిత్రంలో కనిపించిన అనసూయ భరద్వాజ్ ఒక ఆసక్తికరమైన వెబ్ సిరీస్లో కనిపించనుంది.
- By Balu J Published Date - 04:20 PM, Wed - 6 July 22
ఇటీవల గోపీ చంద్ ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో కనిపించిన అనసూయ భరద్వాజ్ ఒక ఆసక్తికరమైన వెబ్ సిరీస్లో కనిపించనుంది. ఓ వేశ్య జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వెబ్ సిరీస్ను తెరకెక్కించేందుకు దర్శకుడు క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగు నవలా రచయిత గురజాడ అప్పారావు రచించిన కన్యాశులకం ఆధారంగా తీయబోయే సిరీస్ లో అనసూయ భరద్వాజ్ వేశ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
కన్యాశులకం అనేది 1890లలో రచించబడిన నాటకం. మధురవాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనుంది. దర్శకుడు క్రిష్ ఆధ్వర్యంలో త్వరలో ఆన్లైన్ సిరీస్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో వెలువడే అవకాశం ఉంది. అల్లు అర్జున్ యొక్క పుష్ప, రవితేజ ఖిలాడిలో అనసూయ భరద్వాజ్ కనిపించడం, ఆమె పాత్రలు హైప్ ను క్రియేట్ చేశాయి. అయితే, రామ్ చరణ్-స్టార్ రంగస్థలంలో రంగమ్మ అత్తా పాత్ర అనసూయకు ప్రశంసలు తెచ్చిపెట్టింది.
Related News
Drug Test : డైరెక్టర్ క్రిష్ నుండి శాంపిల్స్ తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ (Krish).. పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన్ను విచారించిన పోలీసులు శాంపిల్స్ (Drug Test) సేకరించారు. క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. ఒకవేళ, టెస్టులో పాజిటివ్ గా తేలితే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూరిన్ టెస్ట్ లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తెలియాల్సి �