BSNL : 18 ఏళ్ల తర్వాత లాభాల్లోకి BSNL
BSNL : 2007 తర్వాత తొలిసారి 2023-24 ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో సంస్థ రూ.262 కోట్ల లాభాన్ని ప్రకటించింది
- By Sudheer Published Date - 08:43 PM, Fri - 14 February 25

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దాదాపు 18 ఏళ్ల తర్వాత లాభాల్లోకి వచ్చింది. 2007 తర్వాత తొలిసారి 2023-24 ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో సంస్థ రూ.262 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఈ పురోగతితో BSNL మరోసారి దేశీయ టెలికాం రంగంలో తన స్థిరమైన ఆధిపత్యాన్ని చాటుకుంది. సంస్థ లాభాల పరంపరలోకి రావడానికి పలు కారణాలు ఉన్నట్లు BSNL సీఎండీ రాబర్ట్ జే రవి తెలిపారు. ముఖ్యంగా నూతన ఆవిష్కరణలు, వినియోగదారుల సంతృప్తిని పెంచే విధానాలు, నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టడం వంటి అంశాలు లాభాల పెరుగుదలకు దోహదం చేశాయి. ముఖ్యంగా ఖర్చుల తగ్గింపు చర్యలు సంస్థకు అదనపు లాభాన్ని తెచ్చిపెట్టాయని ఆయన తెలిపారు.
Kiccha Sudeep : జీ5లో కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’.. ఎప్పటినుంచంటే…!
BSNL తన 4G మరియు 5G సేవల విస్తరణపై దృష్టి పెట్టినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికతతో సేవలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న మద్దతు, పెట్టుబడులు కూడా సంస్థ పునరుద్ధరణకు సహాయపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం BSNL టెలికాం రంగంలో మళ్లీ తన స్థానాన్ని తిరిగి పొందేందుకు కృషి చేస్తోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీని తట్టుకుని, నాణ్యమైన సేవలను అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ప్రత్యేకించి, గ్రామీణ ప్రాంతాల్లో BSNL సేవలకు మంచి డిమాండ్ ఉంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి BSNL లాభాలు 20 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.