HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Tdp Seeks White Paper On Liquor Revenue In Andhra Pradesh

Liquor Brands in AP : ‘జే బ్రాండ్స్’ ర‌గ‌డ

ఏపీలో `జే బ్రాండ్ల‌`వ్య‌వ‌హారం అమ‌రావ‌తి నుంచి ఢిల్లీ వ‌ర‌కు వినిపించింది. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జంగారెడ్డి గూడెం క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌పై దద్ద‌రిల్లింది.

  • By Hashtag U Published Date - 05:01 PM, Sat - 19 March 22
  • daily-hunt
Yanamala Jagan
Yanamala Jagan

ఏపీలో `జే బ్రాండ్ల‌`వ్య‌వ‌హారం అమ‌రావ‌తి నుంచి ఢిల్లీ వ‌ర‌కు వినిపించింది. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జంగారెడ్డి గూడెం క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌పై దద్ద‌రిల్లింది. అలాగే, టీడీపీ ఎంపీలు పార్ల‌మెంట్ వేదిక‌గా ఏపీలోని జే ట్యాక్స్ గురించి గ‌ళం విప్పారు. మ‌ద్యంపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని తాజాగా టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఆ మేర‌కు పొలిట్ బ్యూరో మెంబ‌ర్ య‌న‌మ‌ల రామ‌క్రిష్ణుడు డిమాండ్ చేశాడు.మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తామ‌ని 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌చారం చేశాడు. ఆ విష‌యాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. కానీ, చంద్ర‌బాబు హ‌యాంలో వ‌సూలు చేసిన ఎక్సైజ్ వాటా కంటే జ‌గ‌న్ స‌ర్కార్ మించి పోయింది. ప‌లు ర‌కాల లోక‌ల్ బ్రాండ్లు ఏపీలోని మ‌ద్య‌నిషేధానికి నిసా ఎక్కించాయి. మ‌ద్యాన్ని త‌యారు చేసే డిస్ట‌ల‌రీ కంపెనీల‌ను అధికారికంగా బ‌య‌ట పెట్టాలి. ఆ కంపెనీలు స‌ర‌ఫరా చేసే మ‌ద్యం బ్రాండ్ల వ్య‌వ‌హారం గుట్టుగా న‌డుస్తోంది. జ‌గ‌న్ స‌ర్కార్ తొలి నుంచి దీనిపై ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటోంది. సాక్షాత్తుగా స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం రాష్ట్రంలో ప్ర‌వ‌హిస్తోన్న అక్ర‌మ సారా వ్య‌వ‌హారాన్ని మీడియా ముఖంగా వెల్ల‌డించాడు. ఏరులై సారా పారుతున్న‌ప్ప‌టికీ ఎక్సైజ్ అధికారులు క‌ట్ట‌డీ చేయ‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తాడు.
డిస్ట‌ల‌రీల‌కు వాస్త‌వంగా టెండ‌ర్లు పిల‌వాలి. నాణ్య‌త‌ను ఎక్సైజ్ విభాగం ప‌రిశీలించాలి. బ్రాండ్ల‌కు అనుమ‌తి ఇచ్చే ముందు ఆ శాఖ అనుమ‌తులు ఉండాలి. ఇవ‌న్నీ ఏమీలేకుండా ప్రైవేటు వ్య‌క్తుల ద్వారా ప‌లు ర‌కాల బ్రాండ్ల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ విక్ర‌యిస్తోంది. నాసిర‌కం, క‌ల్తీ సారాతో జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న మ‌ర‌ణాల క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వ మ‌ద్యం పాల‌సీపై ఢిల్లీ పెద్ద‌లు కూడా ఆరా తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత కొద్ది రోజులుగా కల్తీ మద్యం తాగి 19 మంది మృతి చెంద‌డానికి కార‌ణం ‘జే-బ్రాండ్ ` మ‌ద్యంగా టీడీపీ భావిస్తోంది. అమాయకుల ప్రాణాలను జ‌గ‌న్ స‌ర్కార్ తీస్తోంద‌ని అనుమానిస్తోంది.

చీప్ లిక్కర్, గంజాయి, డ్రగ్స్ వ్య‌వ‌హారం తొలి నుంచి జ‌గ‌న్ స‌ర్కార్ కు మాయ‌ని మ‌చ్చ‌గా మిగులుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే మద్యం కంటే 10 రెట్లు అధికంగా అధికార వైఎస్సార్‌సీపీ నేతలు జే బ్రాండ్ ల తో సంపాదిస్తున్నార‌ని టీడీపీ అంచ‌నా వేస్తోంది. దశలవారీగా నిషేధిస్తామన్న హామీని జ‌గ‌న్ తుంగ‌లో తొక్కాడు. మద్యం విక్రయాల ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అక్రమ మద్యం కార‌ణంగా సంభ‌విస్తోన్న మ‌ర‌ణాల‌ నివారణకు సీఎం చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై టీడీపీ ఆగ్ర‌హంగా ఉంది. మూడేళ్లుగా మద్యం విక్రయాలు, ఆదాయం, పెరిగిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఎక్సైజ్ శాఖ, బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని టీడీపీ నేత య‌న‌మ‌ల స‌వాల్ చేస్తున్నాడు. ఎంత వడ్డీ చెల్లించారు.. ఆ రుణాలకు ఏయే ఆస్తులను తాకట్టు పెట్టారు? కోట్లాది రూపాయల రుణాలు దేనికి ఖర్చు చేశారో.. ప్ర‌జ‌ల‌కు తెలియాలి. మరిన్ని రుణాల కోసం దరఖాస్తు ఎక్క‌డ చేసుకున్నారేమో వెల్లడించాలని జ‌గ‌న్ ను టీడీపీ నిల‌దీస్తోంది. జగన్ పాలనలో మద్యం చావులు, కమీషన్లు, అప్పుల బెడద వెంటాడుతోంద‌ని య‌న‌మ‌ల అభిప్రాయ‌ప‌డ్డాడు. శ్వేత‌ప‌త్రం జే బ్రాండ్ ల‌పై విడుద‌ల చేయాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap liquor brands
  • telugu desam party
  • yanamala ramakrishna

Related News

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna : ఈ విజయాలన్నీ నా తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నా

Nandamuri Balakrishna : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ప్రత్యేక సందడి చేశారు. తాజాగా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న అనంతరం తొలిసారి ఆయన గ్రామానికి చేరుకోవడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.

  • A milestone in a long political career.. 30 years since becoming CM for the first time!

    Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!

Latest News

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd