Chandrababu Letters: ‘ఏపీపీఎస్సీ’ ఇష్యూపై జగన్ కు బాబు లేఖ!
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.
- By Balu J Published Date - 06:09 PM, Mon - 13 June 22
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నోటిఫికేషన్ల విషయమై బాబు ఘాటుగా స్పందించారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. జగన్ కు బాబు రాసిన లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన విషయాలు ఇవే..
విషయం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – నోటిఫికేషన్ల జారీలో జాప్యం – ఆందోళనలో నిరుద్యోగులు – గ్రూప్-1 ఉద్యోగాలకు అభ్యర్ధుల ఎంపికలో అవకతవకలు మరియు నియమావళి ఉల్లంఘన – తగు చర్యలు కొరకు.
రాత్రింబవళ్లు శ్రమపడి ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం కృషి చేస్తున్న నిరుద్యోగ యువత కలలు, లక్ష్యాలను సాకారం చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వీర్యమైనట్లుంది. ప్రతి ఏడాది జనవరిలో క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలవుతుందని మూడేళ్లగా యువత ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ఉద్యోగాలకు అభ్యర్ధులను ఎంపిక చేయడంలో గత 3 సంవత్సరాలుగా వ్యవహరిస్తున్న తీరు అభ్యర్ధుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదనను కలుగజేస్తోంది. కొందరు గ్రూప్-1 అభ్యర్ధులు నన్ను కలిసి తెలియజేసిన విషయాలు మీ దృష్టికి తెస్తూ వారికి న్యాయం చేయాలని కోరుతూ ఈ లేఖ వ్రాస్తున్నాను. 2018లో ప్రకటించిన 165 గ్రూప్-1 ఉద్యోగాలకు డిసెంబర్ 2019లో వ్రాత పరీక్షలు జరిపి మే 2021లో ఫలితాలు ప్రకటించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీల ప్రకటన నుంచి ఫలితాల విడుదల వరకు అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. మెయిన్స్ పరీక్షల తేదీలను ఐదుసార్లు మార్చారు. పరీక్షా పత్రాల మూల్యాంకనం తప్పుడు తడకలుగా జరిగింది. తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు కార్యదర్శి, కమిషన్ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని అభ్యర్ధులు భావిస్తున్నారు.. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం మొదటి మూల్యాంకనంకు, రెండవ మూల్యాంకనంకు ఫలితాల్లో 15 శాతం తేడా లేనప్పుడు మూడవ మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఏంటి? తమ అస్మదీయులను అందలం ఎక్కించటం కోసం గ్రూప్-1 మెయిన్స్లో అక్రమాలకు తెరతీశారు. మొదటిసారి విడుదల చేసిన ఫలితాలకు రెండవసారి విడుదల చేసిన ఫలితాలకు భారీ వ్యత్యాసాలు ఉండటంతో అభ్యర్దులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్దులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపికలో సైతం అక్రమాలు జరిగినట్టు పలువురు అభ్యర్దులు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ శాఖల్లో భారీ మొత్తంలో ఖాళీలున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవటంతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత మూడేళ్లలో ప్రభుత్వ ఉద్యోగం కోసం కృషి చేస్తూ కన్నవారికి భారం కాలేక ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడి తల్లితండ్రులకు కడుపుకోతను మిగిల్చారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ప్రభుత్వ కొలువు సాధించాలన్న లక్ష్యంతో కరోనాను సైతం లెక్క చేయకుండా నిరుద్యోగులు పడుతున్న శ్రమను ప్రభుత్వం వృధా చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఇచ్చిన హామీ మేరకు 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి.
(నారా చంద్రబాబునాయుడు)
టీడీపీ జాతీయ అధ్యక్షులు
Related News
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు లేఖ, ప్రస్తావించిన అంశాలివే
AP Employees: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకుడుగా వ్యవహరిస్తూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు లేఖ రాశారు. ‘‘ఉద్యోగులు తమ పోస్టింగ్లు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉద్�