Vijayawada Utsav 2025: ‘విజయవాడ ఉత్సవ్’కు తొలిగిన అడ్డంకి
Vijayawada Utsav 2025: సుప్రీంకోర్టు తీర్పుతో విజయవాడ ప్రజల్లో ఆనందం నెలకొంది. దుర్గగుడి ప్రాంగణంలో సాంస్కృతిక, వాణిజ్య కార్యక్రమాలతో ఉత్సవ్కను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు
- Author : Sudheer
Date : 22-09-2025 - 3:15 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav 2025) నిర్వహణకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ ఉత్సవ్కను దుర్గగుడి భూముల్లో వాణిజ్య కార్యకలాపాల ఆధారంగా నిర్వహించడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, పిటిషనర్ వాదనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఉత్సవ్క సన్నాహకాలకు మరింత ఊపొచ్చింది.
Chiranjeevi : ‘ప్రాణం ఖరీదు’ కు 47 ఏళ్లు
విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. లీజుకు తీసుకున్న వారికి, అలాగే ఆలయానికి ఎలాంటి సమస్యలు లేని సమయంలో మూడో వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయడం సబబుకాదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతోందని స్పష్టమైన సాక్ష్యాలు లేకుండా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడం సమంజసం కాదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆలయ భూముల్లో వాణిజ్య కార్యకలాపాల ఆధారంగా ఉత్సవ్క నిర్వహణకు ఎలాంటి అడ్డంకి లేదని తేల్చిచెప్పింది.
సుప్రీంకోర్టు తీర్పుతో విజయవాడ ప్రజల్లో ఆనందం నెలకొంది. దుర్గగుడి ప్రాంగణంలో సాంస్కృతిక, వాణిజ్య కార్యక్రమాలతో ఉత్సవ్కను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. స్థానిక కళాకారులకు, వ్యాపారులకు ఈ ఉత్సవ్క మంచి అవకాశంగా భావిస్తున్నారు. కోర్టు తీర్పు కారణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండుగ వాతావరణంలో ఈ ఉత్సవ్కను విజయవంతంగా జరుపుకునే అవకాశం లభించిందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విజయవాడలో రాబోయే రోజులలో ఉత్సాహం మరింత పెరగనుంది.