HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Rtd Ias Ramesh Andhra Pradesh Case

PV Ramesh: పీవీ రమేష్‌ని టార్గెట్‌ చేస్తోంది ఆయనేనా!

పీవీ రమేష్‌. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన్ను టార్గెట్‌ చేస్తోంది ఎవరు? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో, బ్యూరోక్రాట్లలో హాట్‌ టాపిక్‌గా మారింది.

  • By Hashtag U Published Date - 12:45 PM, Wed - 19 January 22
  • daily-hunt
PV Ramesh
PV Ramesh

పీవీ రమేష్‌. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన్ను టార్గెట్‌ చేస్తోంది ఎవరు? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో, బ్యూరోక్రాట్లలో హాట్‌ టాపిక్‌గా మారింది.

పీవీ రమేష్‌ సీనియర్‌ ఐఏఎస్‌గా మంచి గుర్తింపు పొందారు. జగన్‌ సీఎం అయ్యాక కూడా కీలక పోస్టింగ్‌లో ఉన్నారు. రిటైర్‌ అయిన తర్వాత ఆయన్ను తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయిస్తారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత పీవీ రమేష్‌ సైలెంట్‌గా ఉన్నారు.

ప్రస్తుతం ఆయన తల్లిదండ్రులకు నోలీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. పీవీ రమేష్‌ సోదరుడిపై 2018లో కేసు నమోదైంది. ఆయన భార్య 498A కేసు పెట్టారు. ఇప్పుడా కేసులోనే పీవీ రమేష్‌ తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ పటమట పోలీసులు కొండాపూర్‌లోని వారి ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చి ఈ నెల 22న విచారణకు రావాలని స్పష్టం చేశారు.

పోలీసుల నోటీసులతో పీవీ రమేష్‌ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. ప్రస్తుత ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ ఇదంతా చేస్తున్నారన్నది వారి ఆరోపణ. సునీల్‌కుమార్‌కు, పీవీ రమేష్‌కు దగ్గరి బంధుత్వం ఉంది. పీవీ రమేష్‌ సోదరినే సునీల్‌కుమార్‌ వివాహం చేసుకున్నారు. వారి మధ్య కూడా కొన్ని సమస్యలు ఉన్నాయనే చర్చ ఉంది.

రిటైర్డ్‌ అయిన తర్వాత పీవీ రమేష్‌కు, ప్రభుత్వ పెద్దలకు మధ్య గ్యాప్‌ పెరిగిందనే టాక్‌ ఉంది. ఈ పరిణామాలతో పీవీ రమేష్‌ టార్గెట్‌ అయ్యారని తెలుస్తోంది. గతంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులోనూ పీవీ రమేష్‌ను విచారణకు పిలుస్తారనే వార్తలొచ్చాయి. వీటన్నింటి వెనుక సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమారే ఉన్నారనేది రమేష్‌ తల్లిదండ్రుల ఆరోపణ. అయితే ఈ ఆరోపణలను ఖండించారు సునీల్‌కుమార్‌. ఈ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh bureaucrate
  • PV Ramesh
  • Rtd IAS officer

Related News

    Latest News

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd