APSRTC : ఐడియా ఆర్టీసీని మార్చేసింది!
ఐడియా ఆ బస్సుల రూపు రేఖలనే మార్చేసింది. పాత బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్ లుగా మారిపోయాయి..
- By CS Rao Published Date - 12:00 PM, Sat - 4 June 22
ఐడియా ఆ బస్సుల రూపు రేఖలనే మార్చేసింది. పాత బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్ లుగా మారిపోయాయి.. చిత్తూరు2 డిపోలో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. డీజిల్ భారం ఆర్టీసీకి గుదిబండలా మారడంతో ఆర్టీసీ ఈ వినూత్న ఆలోచన చేసింది. ఈ బస్సుల్ని ఎలక్ట్రిక్ బస్ లుగా మార్చేందుకు రెండేళ్ల క్రితం బెంగళూరులోని వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సు పనులు పూర్తయ్యాక విజయవాడకు చెందిన ఆర్టీసీ టీమ్ పరీక్షించింది. ప్రస్తుతం బస్సును చిత్తూరు–2 డిపోకు తెచ్చారు.ముందుగా బస్సును బెంగళూరుకు తరలించారు.. ఇంజిన్, గేర్బాక్స్, డీజిల్ట్యాంకు, పైపులను తొలగించారు. ఈ బస్సు తయారీకి రూ.72 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు అవుతుందట.
2 గంటలు చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఆరు హెవీ డ్యూటీ బ్యాటరీలు ఉంటాయి.. వీటి ఛార్జింగ్కు 1.30 నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఈ బస్సు గేర్ సహాయం లేకుండా స్విచ్ టైప్తో ఆటోమెటిక్గా నడుస్తుంది.. అలాగే గంటకు 80 కి.మీ వేగంతో వెళ్లగలదు. ఎలక్ట్రిక్ మోటార్తో స్టీరింగ్.. పాత పద్ధతిలో బ్రేక్ సిస్టం, డ్రైవర్కు సౌకర్యంగా డాష్బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ద్వారా బ్యాటరీ పరిస్థితి, బస్సు ఏ గేర్లో వెళుతుందో తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సును తిరుపతి–తిరుమల మార్గంలో తిప్పనున్నారు. అన్ని రకాలైన పరీక్షల తర్వాత ఈ బస్సు రొడ్డెక్కబోతోంది. ఏడాది కిందట ఘాట్ రోడ్డులో బస్సును పరీక్షించారు. అనంతరం కేంద్రం అనుమతి కోసం పుణెలోని సీఐఆర్టీకి పంపించారు. అక్కడ పరీక్షించన తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు. ఈ బస్సుల నిర్వహణ బాధ్యతను మూడేళ్ల వరకు వీరావాహన సంస్థే చూసుకుంటుంది. మరోవైపు తొలి ఎలక్ట్రిక్ బస్సు జూలై 1న అలిపిరి డిపోకు చేరుకుంటుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల తెలిపారు.
Tags
Related News
CM Revanth Reddy: త్వరలో రేవంత్ చేతుల మీదుగా 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్నారని తెలిపారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త టీఎస్ఆర్టీసీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.